)
Care taker brutally kills elderly woman in Tirupati: ఇటీవల చాలా మంది తమ ఇళ్లలో పెద్దవాళ్లను చూసుకునేందుకు కెర్ టెకర్ లను పెడుతున్నారు. అంతే కాకుండా ఇంట్లో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుండటంతో జాగ్రత్తగా చూసుకునేందుకు తెలిసిన వారు లేదా కన్సల్టెన్సీలను సంప్రదించి పనివాళ్లను పెట్టుకుంటున్నారు.
కానీ కొంత మంది కొన్నిరోజులు మంచిగా ఉన్నట్లు నటించి తమ అసలు రంగును బైటపెడుతున్నారు. చోరీలకు పాల్పడటం, బంగారం మొదలైన వాటి కోసం చోరీలకు కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
శివ ఆనంద్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో తండ్రి షణ్ముగం, మేనత్త ధనలక్ష్మిలతో కలిసి ఉంటున్నాడు. అతను తన తండ్రికి పక్షవాతం ఎఫెక్ట్ కావంతో ఏజెన్సీతో మాట్లాడి రవి అనే వ్యక్తిని నియమించుకున్నాడు. ఏజెన్సీకి నెలకు రూ. 25 వేలు ఇస్తున్నాడు. కొన్ని నెలలు బాగానే చేశాడు.
అయితే అతను ఏజెన్సీ వాళ్ల తనకు కేవలం రూ. 18 వేలు ఇస్తున్నారని చెప్పాడు. దీంతో ఏజెన్సీతో కాకుండా నేరుగా తన అతనితో మాట్లాడి నెలకు రూ. 22 వేలు ఇచ్చేలా మాట్లాడుకున్నాడు.
అయితే.. ఇటీవల శివ ఆనంద్.. హైదరాబాద్ లో మీటింగ్ కు వెళ్లాల్సి ఉండటంతో కేర్ టెకర్ కు జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్లాడు. ఇదే చాన్సుగా భావించిన రవి.. ఇంట్లో నిద్రపోతున్న ధనలక్ష్మి పై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి, ఆమె చెవికి ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలను తీసుకుని పారిపోయాడు. శివ ఆనంద్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూడా రవి ఫోన్ ఎత్తక పోయేసరికి చుట్టుపక్కల వారిని అలర్ట్ చేశాడు.
దీంతో వారు వచ్చి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే శివ ఆనంద్ తిరిగి తిరుపతి వచ్చాడు. అప్పటికే ఇంట్లో మేనత్త ధనలక్ష్మి విగత జీవిగా పడి ఉంది. సీసీకెమెరాలను పరిశీలిస్తే కెర్ టెకర్ దారుణానికి పాల్పడిన ఘటన రికార్డు అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.