)
Tirumala Garuda Seva: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ సేవను తిలకించేందుకు భారీగా వచ్చిన భక్తులతో ఉదయం 11 గంటలకే మాఢవీధుల్లోని గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్యాలరీలో ఉన్న భక్తులకి నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకి వచ్చే వాహనాల సంఖ్యకి మించి పెరిగిపోవడంతో ప్రయివేట్ వాహనాలు నిలిపేశారు.
ఆర్టీసీ బస్సులోనే భక్తులు రావాలని కోరుతున్నారు. అరిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి తిరుమలకి రావడానికి భక్తులు త్రీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరింది. ప్రతేకంగా ఈరోజు 3,500 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు అని చెబుతున్నా బస్సులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
శ్రీవారి ప్రధాన వాహనం గరుడ వాహన సేవ మాత్రం అన్ని వాహనాలకు కంటే అరగంట ముందు ప్రారంభం అవుతుంది. గ్యాలరీలో ఉన్న భక్తులు గరుడ సేవను దర్శించుకొని వెలుపలికి పంపేసి మళ్లీ గ్యాలరీలో భక్తులకు అనుమతి ఇస్తారు. బయట ఉన్న భక్తులకు గరుడ సేవ దర్శనం కల్పించేలా చర్యలు చేస్తున్నారు. నారాయణగిరి పార్క్, సుపథం, ఆళ్వార్ తోట, అన్నప్రసాదం, ఉత్తర మాఢ వీధుల్లో 40 నిమిషాలు పాటు ఉంచి బయట ఉన్న వారికి దర్శనం కల్పించేలా ఈసారి టీటీడీ ఏర్పాట్లు చేసింది.
తిరుమలలో అడుగడునా పోలీస్ శాఖ వారు 3,700 మంది పోలీసులతో భారీ భద్రత తో నిఘా పెట్టారు. ప్రతేకంగా కొన్ని కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్లో నిరంతరంగా వీక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచారు. మాడవీధుల్లోకి రాలేని భక్తులకు బయట స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook