)
Tirumala Chirutha: చిరుతలో మరోసారి చిరుత కలకలం రేపింది. దీంతో క్యాంపస్లో చదువుతన్న విధ్యార్ధుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొంత కాలంగా SVU పరిధిలో చిరుతలు తిరుగాడటం విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అటవీ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. అయితే రెండు నెలల క్రితం ఒక చిరుత బోనులో చిక్కడంతో దానిని ఎస్వీ జూపార్క్కు తరలించారు. దీంతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మరో చిరుత బయటపడటంతో యూనివర్శిటీ విద్యార్ధులు భయంతో హడలిపోతున్నారు.
ఇక తిరుపతి కొండ ప్రాంతాల్లో తరుచుగా చిరుత సంచరించడం భక్తులకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమలలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం భక్తులకు ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. తిరుమల చుట్టూ శేషాచలం కొండలు విభిన్న జంతుజాలాలకు ఆవాసం గా ఉంటూ వస్తోంది. అటు పక్కనే జూపార్క్ కూడా ఉంది. అక్కడ నుంచి ఒక్కోసారి జంతువులు తప్పించుకొని అడవుల్లో పారిపోయిన దాఖలాలన్నాయి.
దీంతో పాటు కేవలం చిరుతలే కాకుండా ఇతర జంతుజాలం కూడా సంచరిస్తూ ఉంటాయి. పలుమార్లు ఇతర జంతువులు కాలిబాట మార్గంలో భక్తులకు కనిపించి తీవ్ర భయాందనళలు గురి చేసాయి. దీంతో భక్తలందరు గుంపులు, గుంపులుగా వెళ్లాలని టీటీడీ చెబుతుంది. ఒకపుడు 24 గంటలు కాలినడక వెళ్లకుండా రాత్రి సమయాల్లో నడక దారిని నిలిపివేసారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.