)
Tirumla No Filinghing Zone: కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలని తిరుమల తిరుమల దేవస్థానం చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాసారు. తిరుమల పుణ్యక్షేత్రం పై అపుడుపుడు విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం పై నుంచి ఎలాంటి విమానాలు, హెలికాప్టర్స్ కు ప్రవేశం లేదు. కానీ అపుడపుడు ఇలాంటి సంఘటనలు తరుచూ జరగుతూ ఉండటంపై భక్తులు మనోభావాలు దెబ్బ తింటున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుమలలో విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు లేఖ రాశారు. ఆగమశాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్నారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని కోరారరు బీ.ఆర్.నాయుడు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం భక్తులు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe