Toll Tax: నిత్యం హైదరాబాద్ నుంచి విజయవాడకు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ రూట్లో ఆర్టీసీ బస్సులతో పాటు ఎన్ని ప్రైవేటు బస్సులైన ప్రతి నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి వారి జాతీయ రహదారుల సంస్థ శుభవార్త చెప్పింది.
అంతేకాదు తగ్గిన టోల్ రుసుములు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు వన్ వే లో 15 రూపాయలు, టూ వే అయితే 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు , ఇరువైపులా కలిపి 40 రూపాయలు టాక్స్ కట్టాల్సి వుంటుంది. బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి 50 రూపాయలు, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు.
చిల్లకల్లు టోల్ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయలు చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉండనున్నాయి.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








