)
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాల్లో ఆగస్టు 25న (సోమవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఆగస్టు 26,27 తేదీల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయిన పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగస్టు 25వ తేదీన ఏపీలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి, కృష్ణా నదులలో వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 39.2 అడుగులకు చేరింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరిక అమలులో లేదు. కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు, పోలవరం వద్ద 12.65 మీటర్లుగా ఉంది. మరోవైపు ధవళేశ్వరం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
కృష్ణా నదిలో వరద ప్రవాహం విషయానికి వస్తే... శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో4.05 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో అక్కడ మొదటి హెచ్చరిక ఉపసంహరించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook