)
Family Issues: పెళ్లయి పద్నాలుగేళ్లు అయ్యింది. పండంటి కాపురానికి వారి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు పిల్లలు కలిగారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటి కారణంగా అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో చిచ్చురేపాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉంటున్న కుమార్తెకు నచ్చజెప్పి.. అత్తవారింటికి పంపించాల్సి ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అల్లుడు కోరినా కూడా తమ బిడ్డను పంపించకపోవడంతో వారిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారి గూడెం గ్రామానికి ఏకుల బాబురావు, శారద దంపతులు. నల్లజర్లకు చెందిన రామకోటేశ్వరరావుకు 14 ఏళ్ల కిందట తమ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగాయి. తరచూ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. ఈ విషయాన్ని భార్య తమ తల్లిదండ్రుల వద్ద మొర పెట్టుకుంది. ఒకరోజు గొడవ తీవ్రం కావడంతో భార్య భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
గొడవ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి కాపురానికి రావడం లేదు. ఈ విషయమై అత్తామామలు బాబురావు, శారదను అల్లుడు కోటేశ్వర రావు కోరాడు. అయితే తమ కుమార్తెను పంపేందుకు అంగీకరించలేదు. ససేమిరా అనడంతో అత్తామామలతో బుధవారం కోటేశ్వర రావు గొడవకు దిగాడు. ఈ సందర్భంగా పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహావేశానికి లోనయిన కోటేశ్వర రావు అత్తామామలు బాబురావు, శారదను హతమార్చాడు.
వారిని హత్య చేసిన తర్వాత రామకోటేశ్వరరావు సంఘటనా స్థలంలోనే కూర్చున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.