)
Tirumala Devotees: కోరిన కోర్కెలు నెరవేర్చే కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు దర్శనాలు సజావుగా సాగడం.. తిరుమల సేవలను కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి టీటీడీ తీవ్రంగా కృషి చేస్తోంది. కోట్లాది భక్తుల భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరిన్ని సేవలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. అత్యవసరంగా సమావేశమైన టీటీడీ పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
టీటీడీ పాలకమండలి మంగళవారం జరగ్గా.. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం చైర్మన్ మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. 'ఇటీవల బెంగుళూరులో టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీనివాస కల్యాణంలో అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంలతో కొన్ని చర్చలు జరిగాయి. బెంగుళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరగా మేం అతడి విజ్ఞప్తిని స్వాగతించాం. ప్రస్తుతం బెంగుళూరులో ఆలయం చిన్నగా ఉండడంతో మంచి స్థలంలో పెద్ద ఆలయం నిర్మించాలని కోరడంతో దానికి మండలి ఆమోదం తెలిపింది' అని చైర్మన్ వెల్లడించారు.
==> టీటీడీకి 100 విద్యుత్ బస్సులు అందజేస్తానని కేంద్రమంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాదారుల నిలుపు దోపిడీ నుంచి భక్తులకు విముక్తి లభిస్తుంది.
==> తిరుపతిలో త్వరలోనే సీఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు జరగనుంది. ల్యాబ్ నిర్మాణానికి స్థలాన్ని లీజు పద్ధతిలో కేటాయించాలని టీటీడీ నిర్ణయం. సీఎస్ఆర్ ల్యాబ్ ద్వారా నెయ్యి, నీరు, పప్పు ధాన్యాలు నాణ్యత పరిశీలన ఇక్కడే చేసేలా చర్యలు.
ఎయిర్ పోర్ట్ కు శ్రీవారి పేరు
తిరుపతి (రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని కేంద్ర విమానాయన శాఖకు ప్రతిపాదన పంపించాలని నిర్ణయం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చేలా చర్యలు.
==> సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లో దాదాపు 1,600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ.
==> టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం కార్యక్రమం చేపట్టేందుకు టీటీడీ నిర్ణయం.
==> వరలక్ష్మీ వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని టీటీడీ పాలకమండలి సమావేశం నిర్ణయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook