TTD Board: మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కానుంది. టీటీడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ బేటీలో సుమారుగా రూ. 5400 కోట్లఅంచనాలతో 2025 - 26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.గత ఏడాది వార్షిక బడ్జెట్ రూ. 5141 కోట్లుగా ఉంది. అయితే ఈ సమావేశంలో 30 కు పైగా అజెండా అంశాలపై చర్చించితీర్మానాలు చేయనున్నారని సమాచారం. సీఎంచంద్రబాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా శంలోని అన్ని రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అంతేకాదు శ్రీవారి కైంకర్యాలకు ముడి సరుకులు కొనుగోలు కోసం నిధులు విడుదల చేయనున్నారు.దీనికి తోడు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టిటిడి డిపాజిట్లను వెనక్కు తీసుకొనిజాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫారసులపై కూడాచర్చించనున్నారు. వేసవి నేపథ్యంలో కొండపై నీటి కొరత లేకుండా చర్యలకు ప్రణాళికల రచనపై చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజా నిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై ఈ భేటిలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
దీనికి తోడు వేసవి సెలవులు రద్దిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పనపై చర్చించనున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా వాళ్ల కు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు కొండ కింద భక్తులకు ఇచ్చే ఉచిత టోకెన్స్ ను మరో 5 వేలకు పైగా పెంచడానికి ఈ పాలక మండలి భేటిలో నిర్ణయం తీసుకోనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









