Tirumala Darshan: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Latest News: తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫార్సుల లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2025, 10:00 PM IST
Tirumala Darshan: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Latest News: వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే  పరిమితం చేసింది. స్కూల్స్, కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం ఒక్కరోజే 83 వేల మంది వరకు భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. అదేవిధంగా మే 1వ తేదీ నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది.

మే 11 నుంచి వసోంత్సవాలు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

మే 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఉత్స‌వాల నేపథ్యంలో మే 6, మే 10 నుంచి 13వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

Also Read: Indian Navy: పాక్ సరిహద్దుల్లో భారత నేవీ మిసైల్ ప్రయోగం.. యుద్ధనౌకల మోహరింపు వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News