Cobra Snake enters ttd eo shyamala rao bungalow: తిరుమలలో గోశాల వివాదం ప్రస్తుతం రచ్చగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏకంగా గతంలో టీటీడీకి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి దీనిపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కూటమికి వ్యతిరేకంగా తిరుమలలో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తిరుమలలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
టీటీడీ ఈవో శ్యామల రావు ఉంటున్న బంగ్లాలో ఒకభారీ సర్పం ప్రవేశించింది. ఈ క్రమంలో వెంటనే దాన్ని గుర్తించిన అక్కడున్న సిబ్బంది పాములను పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఇంతలో టీటీడీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ నాయుడు పామును పట్టుకునే ప్రయత్నంచేశాడు. అది కాస్త సంచిలోకి వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.
ఈ క్రమంలో వెంటనే రవీందర్ నాయుడును స్విమ్స్ కు తరలించారు. ప్రస్తుతం రవీందర్ హెల్త్ నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అదే విధంగా ఒక వైపు తిరుమలలో గోశాల వివాదం, ఇటీవల మాజీ మంత్రి రోజా సైతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై శ్రీవారి జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇద్దరికి తెలిసొచ్చిందని కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ ఈవో ఇంట్లో భారీ సర్పం ప్రవేశించడం పట్ల భక్తులు మాత్రం తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో దయచేసి ఎలాంటి అపచారాలు జరక్కుండా చూసుకొవాలని అధికారుల్ని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









