Panchanga Sravanam on Ys Jagan: తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది అందరూ ఆనందంతో జరుపుకుంటున్నారు. ఉగాది రోజున తప్పకుండా కన్పించే పంచాంగ శ్రవణం జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం చర్చనీయాంశంగా మారింది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర వేడుకలు ఏపీలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగ కర్త అవధాని నారాయణ ముర్తి పంచాంగ పఠనం విన్పించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిధున రాశిలో పుట్టిన జగన్కు భయం అనేది తెలియదని, గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎక్కడా భయపడలేదని వివరించారు. ఆయన వైఎస్ జగన్ను ఏకంగా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలతో పోల్చారు. శ్రీ కృష్ణదేవరాయల మాదిరిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో సృష్టించినట్టే మరోసారి వైఎస్ జగన్ ఘన విజయం సాధిస్తారన్నారు. ప్రజలు ఆవేశంతో చేసిన తప్పులకు ఇప్పుడు చింతిస్తున్నారని అవధాని తెలిపారు. ఈ ఏడాది మిధున రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పారు. సాధారణంగా చాలామంది ఓడినప్పుడు భయపడతారని చెప్పారు. కానీ జగన్ అలా భయపడలేదని గుర్తు అవధాని నారాయణ మూర్తి గుర్తు చేశారు.వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొంటారని తెలిపారు.
అయితే ఈ కార్యక్రమం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలోనే జరిగినా వైఎస్ జగన్ లేదా ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొనలేదు. పార్టీ పెద్దలు కూడా దూరంగా ఉన్నారు.
Also read: Ugadi 2025: ఈ ఏడాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









