)
YS Sharmila At Amaravati: 'మలి విడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముందు 33 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆలు లేదు..చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది బాబు తీరు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గాల్లో కాదు మీరు నేలమీద నడవాలని హితవు పలికారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో శుక్రవారం వైఎస్ షర్మిల పర్యటించారు. రాజధాని పనులు ఎక్కడకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అక్కడ ఎలాంటి పనులు కనిపించకపోవడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా 5 వేల ఎకరాల్లో ఇప్పుడే మరో ఎయిర్పోర్ట్ ఎందుకు? అమరావతికి అంత బిజినెస్ ఉందా? అంత బిజీ...నెస్ ఉందా?' అని ఎద్దేవా చేశారు. గన్నవరం ఎయిర్పోర్టుకు ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దిక్కులేదని షర్మిల గుర్తుచేశారు.
'రాజధాని కేంద్రం నిర్మించే ప్రాజెక్ట్. మోడీ గల్లా పట్టి రూ.లక్ష కోట్లు తీసుకురండి. రాజధాని పేరుతో అప్పులు చేసి మా నెత్తిన భారం మోపకండి. సెల్ఫ్ ఫైనాన్స్ మనకెందుకు? మోడీ మెడలు వంచి నిధులు తీసుకురండి' అని సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూచించారు. మలి దశ 40 వేల ఎకరాల భూ సేకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. '2015లో మోదీ వచ్చి శిలాఫలకం వేసి మట్టి కొట్టి వెళ్లారు. శంకుస్థాపన చేసి పదేళ్లు దాటింది. మోడీ మళ్లీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మోడీ మాటలు వినడానికి.. చూడఆనికి అసహ్యంగా ఉంది' అని వైఎస్ షర్మిల తెలిపారు.
'మోడీ మాటలు నమ్మి చంద్రబాబు రాత్రి పడ్డ గోతిలో పగలు పడ్డారు. మోదీని మళ్లీ ఎలా నమ్మారో తెలియదు. రాజధాని సింగపూర్, జపాన్ కన్నా అద్భుతం. రాజధాని బెస్ట్ లెవెబుల్ సిటీ అన్నారు. పదేళ్ల తర్వాత పిచ్చిమొక్కలు తప్పా ఏమి లేదు' అని వైఎస్ షర్మిల తెలిపారు. 29 వేల మంది రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వారి త్యాగం ఫలించలేదని చెప్పారు. ఇప్పటికీ రాజధాని పేరుతో ఆంధ్రా ప్రజలను భ్రమలో పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు.
'రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం ఉంది. మోడీ కూడా డిల్లీని తలపించే రాజధాని అన్నాడు' అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. రాజధాని కి అప్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో అప్పులు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. 'రాజధాని నిధులు మోడీ మెడలు వంచి తీసుకురాలేరా? మోడీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? విభజన హామీ ప్రకారం మన హక్కు అని మీకు తెలియదా? అప్పులు తెచ్చి జనాల నెత్తిన ఎందుకు పెడుతున్నారు?' అని సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు.
'2015లోనే మూడేళ్లలో రాజధాని కడతామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ మూడేళ్లు అంటున్నారు. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట. రాజధానికి మలి విడత భూముల సేకరణలో పెద్ద కుట్ర ఉంది' అని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. మోడీ కాలర్ పట్టుకొని నిలదీయండి. రూ.లక్ష కోట్లు అయితే రూ.లక్ష కోట్లు.. రూ.50 వేల కోట్లు అయితే 50 వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకురావాలి' అని చంద్రబాబుకు షర్మిల సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook