Kohli In Simhachalam: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ సందడి..సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లిన లెజండరీ క్రికెటర్!

Virat Kohli In Simhachalam: టీమ్ఇండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ  ఇప్పుడు వైజాగ్ పర్యటనలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా చివరి వన్డేను వైజాగ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించగా.. ఇప్పుడు సింహాద్రి అప్పన్న దర్శనానికి విరాట్ కోహ్లీ వెళ్లాడు.

Written by - Harish Darla | Last Updated : Dec 7, 2025, 03:47 PM IST
Kohli In Simhachalam: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ సందడి..సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లిన లెజండరీ క్రికెటర్!

Virat Kohli In Simhachalam: టీమ్ఇండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ  ఇప్పుడు వైజాగ్ పర్యటనలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా చివరి వన్డేను వైజాగ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు టీమ్ఇండియా జట్టు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు వైజాగ్ ‌లోని సింహాచలం గుడిని విరాట్ కోహ్లీ సందర్శించారు. 

Add Zee News as a Preferred Source

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ ప్రత్యేక పూజలు చేశారు. కోహ్లీతో పాటు వాషింగ్టన్ సుందర్, టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కొందరు వ్యక్తులు ఈ గుడిని సందర్శించారు. కోహ్లీ రాకతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. సాధారణ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన కోహ్లీని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కోహ్లీ రాక తెలిసిన సింహాచలం ఆలయ అధికారులు, గుడి అర్చకులు కోహ్లీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో వరాహ స్వామి దర్శనం చేసుకున్న కోహ్లీ.. ప్రత్యేక పూజలు చేయించారు. వెంటనే వేదశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. 

సింహాచలానికి విరాట్ కోహ్లీ వచ్చాడన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు గుడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు యువత ఎంతో ఉత్సాహాంగా ఆలయానికి చేరుకున్నారు. ఆయన్ని చూడటమే కాకుండా ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో పోలీసులు విరాట్ కోహ్లీ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ చూసిన విరాట్ కోహ్లీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలో తన మ్యాజిక్ చూపాడు. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగి.. కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌తో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ అపూర్వ విజయంతో సౌతాఫ్రికాపై 2-1 తేడాతో టీమ్ఇండియా సిరీస్‌ను గెలుపొందింది. 

Also REad: Samantha Second Marriage: రెండో పెళ్లి తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..సామ్ మళ్లీ అదే తప్పు చేస్తుందా? షాక్‌లో ఫ్యాన్స్!

Also Read: Cheaper Than Dmart: మార్కెట్లో డీ-మార్ట్‌కి పెద్ద పోటీ ఈ దుకాణం వచ్చేసింది..ఏ వస్తువు అయినా రూ.100 లోపే దొరికేస్తుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News