)
Vision Units by AP Government: గ్రామ సచివాలయాల పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని ఈ యూనిట్ల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 13,326 గ్రామ, వార్డు సచివాలయాలను 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 'స్వర్ణాంధ్ర విజన్ 2047'కి అనుగుణంగా ఈ పేరును మార్పు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇదే విషయాన్ని గురువారం అమరావతి డేటా డ్రివెన్ గవర్నెన్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తెలియజేశారు. గ్రామ సచివాలయాల పేరును మరింత ఎఫెక్టివ్గా మార్చాల్సి వచ్చిందని ఆయన భావించారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను 'విజన్ యూనిట్స్' అని పిలుస్తామని.. ప్రజలకు సేవలందించి కేంద్రాలుగా ఇవి కొనసాగుతాయని ఆయన అన్నారు.
ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ప్రతి 2,000 మంది జనాభాకు గానూ ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అప్పటి సీఎం జగన్ ప్రకటించారు. గ్రామాల పరిధిలో గ్రామ సచివాలయాలు.. పట్టణాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సచివాలయంలో 13 మంది వరకు సిబ్బందిని నియామకం చేశారు. పంచాయితీ పరిధిలో చేయాల్సిన పనులన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాలను అప్పగించారు. కానీ, అప్పట్లో వారికి తగినంత పని లేదని విమర్శలు వచ్చాయి.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సచివాలయ ఉద్యోగుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. వారందర్ని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేశారు. చాలా వరకు ఈ ఉద్యోగులంతా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామ, వార్డు సచివాలయాలను విజన్ యూనిట్స్ గా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించి సంచలన ప్రకటన చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook