AP Rains: దేశ వ్యాప్తంగా ఎండా కాలం భిన్నంగా ఉంది. ఓ మండుతున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. రైతులకు మాత్రం ఈ వర్షాలు కడగండ్లు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిర్చి సహా ఇతర పంటలు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షం ముందు వచ్చే తీవ్రమైన గాలులకు అవి కొట్టుకుపోతున్నాయి. మరోవైపు మామిడి సహా ఇతర పంటలకు సంబంధించిన కాయలు రాలిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మొత్తంగా మండిపోతున్న ఎండలతో పాటు అకాల వర్షాలు కామన్ పీపుల్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. బీదీంతో ప్రజలు మరో సారి అప్రమత్తంగా వుండాలని విపత్తు నిర్మహణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కర్నూలులో 40.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. అనకాపల్లి జిల్లా చీడికాడలో42.5 మిమీ అధిక వర్షపాతం నమోదైంది.
మరోవైపు తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు కురువనున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, భూపాలిపల్లి జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ములుగు, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









