
Thalliki Vandanam Full Details: చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇవ్వనుంది. ఈనెల 12వ తేదీ నుంచి అంటే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం వరుసగా సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తున్న క్రమంలో తల్లికి వందనం కూడా అమలు చేయనుంది. ఈ నెల నుంచి ప్రారంభమవుతున్న ఈ పథకానికి అర్హులు ఎవరు? ఏమేమి ధ్రువపత్రాలు ఉండాలి? ఏం చేస్తే రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో పడతాయో తెలుసుకుందాం.
ప్రారంభం: జూన్ 12, 2025 (పాఠశాలల పునఃప్రారంభం నుంచి)
లబ్ధిదారులు: ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు.
ఆర్థిక సహాయం: ప్రతీ సంవత్సరం 15000/-
కలిగే ప్రయోజనం: తల్లులకు ఆర్థిక సహాయం, పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు
పథకానికి కావాల్సిన అర్హతలు
==> ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
==> ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారై ఉండాలి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులు.
==> కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
==> తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి
==> కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
కావలసిన ధ్రువపత్రాలు
==> ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి , తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.
==> తల్లికి వందనం రూ.15,000 బ్యాంకు ఖాతాలోపడాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐ జూన్ 5వ తేదీలోపు లింక్ చేసుకోవాలి.
==> ఇప్పటివరకు లింక్ చేసుకోని వారు అనుసంధానం కోసం సమీపంలోని తపాలా కార్యాలయంలో లేదా సచివాలయాలలో సంప్రదించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook