)
Young man from andhra pradesh anakapalle died in Arunachalam: అరుణాచలంను చాలా మంది ఎంతో నమ్ముతుంటారు. రమణ మహర్షిని భక్తుల కొంగు బంగారంగా భావిస్తారు. చాలా మంది ఇక్కడకు పౌర్ణమి వేళ వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. అంతేకాకుండా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు భక్తులు తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న ఒక యువకుడు కత్తిపోట్లకు గురయి చనిపోయాడు.
కొంత మంది ఆగంతకులు ఆయన్ను డబ్బులు అడిగి ఇవ్వకుంటే పొడిచి చంపిన ఘటన పెనుసంచలనంగా మారింది. అప్పటి నుంచి చాలా మంది భక్తులు అరుణాచంలో అంటే కొన్ని రోజుల పాటు భయపడిపోయారు. ఇప్పటికి కొంత మంది అక్కడ ఇతరు స్టేట్స్ వాళ్లను వాలెట్ పోయిందని, డబ్బులు కావాలని అడగటం కన్పిస్తుంది.
అయితే.. తాజాగా.. ఏపీలోని అనకాపల్లిలోని యువకుడు అరుణాచలంలో చనిపోవడం వార్తలలో నిలిచింది. అయితే.. ఇక్కడ మాత్రం యువకుడి మర్డర్ మిస్టరీ వెనుక లవ్ ఎఫైర్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని అనకా పల్లి జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు.. రాంబిల్లి మండలం వెంటకటాపురంకుగ్రామానికి చెందిన రూపను ప్రేమించాడు.
ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు అయితే.. ఇక్కడ యువతి తల్లి కూడా నవీన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇంట్లో వారికి తెలియడంతో.. నవీన్ ను పక్కా ప్లాన్ ప్రకారం అరుణాచలం తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసినట్లు యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కొడుకును రూప, చిన్ని మాయ మాటలు చెప్పి వల్లో వేసుకున్నారని కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో పోలసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook