)
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావడం లేదు.. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. అయితే ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తారని.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేంత స్థాయిలో ఎమ్మెల్యేలు లేరని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో వైఎస్ జగన్ అసెంబ్లీ వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మిగతా పది మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ వెళ్లొద్దని ఆదేశించారు. దాంతో వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అంతేకాదు.. వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తారని అంటున్నారు.. కానీ ఆలోపే వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది.
ఇక వైసీపీ అధికారం కోల్పోయాక.. వైఎస్ జగన్ ఎక్కువ టైమ్ బెంగళూరులోనే ఉంటున్నారు. వారానికి రెండు, మూడుసార్లు మాత్రం.. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెళుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు తాడేపల్లికి వచ్చిన వైఎస్ జగన్.. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని ఆదేశించి.. బెంగళూరు వెళ్లిపోయారు. ఈనెల 24వ తేదీన మరోసారి తాడేపల్లికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదేరోజు పార్టీ నేతలతో మరోసారి సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశానికి రావాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి తప్పనిసరిగ్గా రావాలని నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే జగన్ తప్పక రావాలంటూ చేసిన సూచనపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతానికి వైసీపీ అధినేత జగన్ దగ్గర రెండు మార్గాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఒకటి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదంటే.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే ఆప్షన్ ఉంది. కానీ జగన్ అసెంబ్లీకి వెళ్లే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ గడప దాటబోనని జగన్ శపథం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి హాజరైతే.. అందరూ విచిత్రంగా చూస్తారనే భావనలో ఆయన ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అసెంబ్లీకి వెళ్లడం కన్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే మంచిదని అనుకుంటున్నారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.
ఏదీఏమైనా ఏపీలో ప్రతిపక్షం వైసీపీనే. ఇస్తేగిస్తే ఫ్యాన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. అందుకే ఈ విషయాన్ని ప్రజల వద్ద చెప్పాలని ఆయన అనుకుంటున్నారట. కోర్టుకు వెళ్లినా సమాధానం ఇవ్వడం లేదని అందుకే తాము ప్రజల వద్దకు వస్తున్నామని ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రాజీనామాలు సమర్పించి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే ఈనెల 24వ తేదీన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనీ చెబుతున్నారు. అయితే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయాల్లో మరో సంచలనం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.