
Madhurawada Boyfriend Attack: ఆంధ్రప్రదేశ్లో వరుసగా మహిళలపై నేరాల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో తాజాగా మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించడానికి నిరాకరించిన యువతితోపాటు ఆమె తల్లిని విచక్షణా రహితంగా దాడి హతమార్చాడు. ఈ సంఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకోగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సంఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాలనపై విరుచుకుపడ్డారు.
విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితురాలు నక్కా దీపిక కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్ధితిలో ఉండడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువకముందే విశాఖలో ప్రేమోన్మాది దాడి జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్ధితిలో ఉండడంపై జగన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రేమోన్మాది నవీన్ను కఠినంగా శిక్షించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe