)
Andariki Illu Cancel: 'మీకు ధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా?' అని చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలదీశారు. 'పేదలకు అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని అభివర్ణించారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయినట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. పేదలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి.. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అని మండిపడ్డారు. అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
'ఇళ్ల పట్టాలూ ఇవ్వక.. ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కానీ మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా 'పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం' అని వైఎస్ జగన్ వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5 లక్షల కోట్లపైమాటే అని ప్రకటించారు. 'ఇళ్ల పట్టాలు, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు మా పరిపాలనా కాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం' అని వైఎస్ జగన్ ప్రకటించుకున్నారు.
'చంద్రబాబు జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా?' అని మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. '12 అక్టోబర్ 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు.
'సిమెంటు, స్టీలు వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ 16 నుంచి 17 నెలల కాలంలో మీరెంత ఖర్చు చేశారు?' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించరు. 'పేదలకు ఇళ్లు కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగం లేదు. అమరావతిలో 50 వేల పేద అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేశారు' అని వైఎస్ జగన్ వివరించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు పేదల ద్రోహీ కాదా? అని నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook