విజయవాడ: ఇందిగాంధీ స్టేడియం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. వేలాది మంది సమక్షంలో గవర్నర్ నరసింహన్ జగన్ చేత ప్రమాణస్వీకారం చేశారు. ఏమాత్రం తడబాటు లేకుండా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగన్ ప్రమాణస్వీకారం ప్రారంభించగానే స్టేడియం మొత్తం జగన్ నామస్మరణంతో స్టేడియం మార్మోగింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ , తమిళనాడు డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ లు హాజరయ్యారు. జగన్ సీఎంగా ప్రమాణ్వీకారం అనంతరం కేసీఆర్, స్టాలిన్ లు జగన్ కు పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభిందనలు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతీతో పాటు వైసీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.