కడప: పులివెందులలో వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి సతీశ్ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల మెజార్టీతో జగన్ రికార్డు స్థాయి గెలుపు సాధించారు. తాజా విజయంతో గతంలో కంటే ఎక్కున మెజార్టీ సాధించినట్లయింది. భారీ విజయం సాధించిన జగన్ కు వైసీపీ నేతలు అభినందనలు తెలిపారు. మరోవైపు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.