)
Ys Raja Reddy: వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలు జిల్లాలోని ఉల్లి మార్కెట్ కు వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ షురూ అయ్యింది. రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రాజారెడ్డి కర్నూలు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందని చెప్పవచ్చు. అయితే షర్మిల మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. అసలు రాజకీయ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా?తన మేనమామ వైఎస్ జగన్ కు చెక్ పెట్టేందుకే వైఎస్ షర్మిల తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా. తల్లికి అండగా ఉండేందుకు తనయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడే రచ్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల సోమవారం కర్నూలు జిల్లాలోని ఉల్లి మార్కెట్ కు వెళ్లారు. అయితే తన వెంట కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం కర్నూలు జిల్లాలోని ఉల్లి మార్కెట్ను సందర్శించారు. ఆమె పర్యటనలో ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా ఆమెతో కలిసి రావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆయన అమ్మమ్మ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే షర్మిలతో కలిసి కర్నూలుకు రావడం ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చింది. విజయమ్మ స్వయంగా బయటకు వచ్చి షర్మిల, రాజారెడ్డిని వీడ్కోలు పలకడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జోరందుకున్నాయి. వీడియోలు, ఫొటోలు విస్తృతంగా షేర్ అవుతుండడంతో నెటిజన్లు రాజారెడ్డి రాజకీయ రంగప్రవేశం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలకు స్వయంగా షర్మిల సమాధానం ఇచ్చారు. కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో మాట్లాడిన ఆమె అవసరం వచ్చినప్పుడు నా కుమారుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు అంటూ క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాలకే పరిమితం కాకుండా, షర్మిల రైతు సమస్యలపై కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉల్లి రైతులు తగిన మద్దతు ధర పొందకపోవడాన్ని ఆమె తీవ్రంగా ఎత్తి చూపారు. గతేడాది క్వింటాల్ ఉల్లిపాయ రూ.4,500కి అమ్ముడయ్యిందని, కానీ ఇప్పుడు రైతులు క్వింటాల్ ను రూ.600కే అమ్మాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా రూ.1,200 ధర ఇస్తున్నామని చెప్పినా, వాస్తవానికి రైతులు ఆ ధర పొందలేకపోతున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం నిజంగా రైతు పక్షపాతమే అయితే, ఉల్లి పంటకు కనీసం క్వింటాల్ కు రూ.2,400 ధర ఇవ్వాలి. లేకపోతే రైతులు బతకలేరు అని షర్మిల వ్యాఖ్యానించారు. అదేవిధంగా, పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతులపై కేసులు పెట్టడం దారుణమని, ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద, షర్మిల కర్నూలు పర్యటన రాజకీయపరంగా, రైతు సమస్యల పరంగా రెండు కోణాల్లోనూ చర్చనీయాంశంగా నిలిచింది. ముఖ్యంగా రాజారెడ్డి హాజరుతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. త్వరలోనే కొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.తన మేనమామ వైఎస్ జగన్ కు చెక్ పెట్టేందుకే వైఎస్ షర్మిల తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.