
Wakf Amendment Bill: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ చట్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి సుస్పష్టమైంది. వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పార్లమెంట్ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. లోక్సభలో పార్టీ నేత మిధున్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏపీలో అధికారంలో ఉన్నంత వరకూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్టాండ్ మార్చింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను వైసీపీ సమర్థిస్తూ వచ్చింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏకు మద్దతిచ్చింది. ఆఖరికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తమకు వ్యతిరేకంగా టీడీపీ-జనసేనతో బీజేపీ జతకట్టినా వైసీపీ వ్యతిరేకం కాలేదు. బీజేపీకు వ్యతిరేకంగా గళం ఎత్తలేకపోయింది. కానీ ఇప్పుడు ఒకేసారి స్వరం మార్చింది.
ఎన్డీఏ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై వ్యతిరేకత కనబర్చింది. ఈ చట్టానికి తాము వ్యతిరేకమని ఏకంగా పార్లమెంట్లో ప్రకటించి అందర్నీ ఆశ్చర్చపర్చింది. లోక్సభలో ఎంపీ మిధున్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని సైతం వక్ఫ్ చట్టం సవరణ అంటే రాజ్యాంగంపై చేసిన దాడిగానే అభివర్ణించారు. ఈ చట్టానికి వ్యతిరేకమని గతంలో ప్రకటించినా పార్లమెంట్ సాక్షిగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఈసారి బీజేపీతో కయ్యానికి సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి