)
Govt Medical Colleges: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించేందుకు ఏర్పాటుచేసిన వైద్య విద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. నేటి నుంచి 45 రోజులు విస్తృత కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా చంద్రబాబు కుట్రలు మోసాలని ప్రజలకు బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.
ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి అక్టోబర్ 28న నియోజకవర్గం, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టనుంది. కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు ఉద్యమానికి భారీ స్థాయిలో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తుచేశారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్య దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలో శుక్రవారం నుంచి ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రజా ఉద్యమం చేపట్టనుంది. శుక్రవారం నుంచి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను సమర్పించనున్నారు. పార్టీ మాత్రమే కాకుండా, పౌరసమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తారస్థాయికి చేరాయని అర్థమవుతోందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook