TS SSC exams 2020: 10వ తరగతి పరీక్షలు.. సర్కారు నిర్ణయంపైనే ఉత్కంఠ
TS Tenth class exams: హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో జూన్ 8 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ( TS SSC exams) జరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ పరీక్షలను నిర్వహించడం అవసరమా అనే కోణంలో హైకోర్టులో విచారణ జరుగుతోంది.
Health tips: సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ తాగి చూడండి
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
Telangana: కరోనాతో రాష్ట్రంలో మరో 8 మంది మృతి
COVID-19 in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ మరునాడైన శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగి 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 143 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 cases) నమోదయ్యియి
Godavari water issue: గోదావరి నీటి తగువుపై స్పందించిన తెలంగాణ
Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది.
TS SSC exams 2020: 10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్
SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది.
Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
COVID-19 in Telangana తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. గురువారం నాడు రాష్ట్రంలో 127 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ కాగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 110 మంది ఉన్నారు.
వాడివేడిగా కృష్ణా రివర్ బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య తేలిన లెక్కలు
Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్లో పవర్ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీటిని పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
Rajya Sabha polls: కాంగ్రెస్కి షాకిచ్చిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
Rajya Sabha election రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్లో ( Gujarat ) మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్ ( Akshay Patel ), జీతూ భాయ్ చౌదరి ( Jitu Bhai Chaudhary ) తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి లేఖలు పంపారు.
Govt jobs alert: వైద్య ఆరోగ్య శాఖలో 9700 ఖాళీల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్
ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ( Good news to unemployed ). వైద్య, ఆరోగ్య శాఖలో 9700 ఖాళీలను భర్తీ చేసేందుకు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు ( Jobs in health dept). వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న వారికి ఇది నిజంగానే ఓ గుడ్ న్యూస్.
ప్రముఖ అగ్ర దర్శకుడు కన్నుమూత
Basu Chatterjee బసు చటర్జీ ఇక లేరు. బాలీవుడ్లో ప్రముఖ అగ్ర దర్శకుడిగా పేరొందిన బసు చటర్జీ జూన్ 3న ముంబైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 90 ఏళ్లు. సాధారణ మధ్య తరగతి జీవితాల గురించి, వారి సామాజిక స్థితిగతుల గురించి కళ్లకు కట్టినట్టు హృద్యంగా తెరకెక్కించడంలో ఎవరైనా బసు చటర్జీ తర్వాతే. రజనిగంధ, చోటీ సి బాత్, ఖట్టా మీటా, బాతో బాతో మే, శౌకీన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన తెరకెక్కించినవే.
Indian Railways: ప్రయాణికులకు ఆ డబ్బు తిరిగిచ్చేసిన రైల్వే
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
Delhi earthquake: ఢిల్లీలో మళ్లీ భూకంపం.. వణికిస్తున్న వరుస భూకంపాలు
Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
Cyclone Nisarga: తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన సముద్రం
Cyclone Nisarga live updates నిసర్గ తుఫాన్ తీరాన్ని తాకింది. వాతావరణ శాఖ ( (IMD ) అంచనా వేసినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 2.30 గంటల వరకు కొనసాగింది. అలీబాగ్కి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అరేబియా సముద్రం ( Arabia sea ) అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలజడితో తీర ప్రాంతాల్లో పలు చోట్ల అలలు 15-20 అడుగుల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి.
CM KCRకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి Kishan Reddy లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ( Union minister Kishan Reddy writes to CM KCR ). 202 నెంబర్ జాతీయ రహదారిపై అంబర్పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన నాలుగు లైన్ల వంతెన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిందిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
COVID-19 updates: తెలంగాణలో 92కి చేరిన కరోనా మృతుల సంఖ్య
Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 70 కేసులు వెలుగుచూశాయి.
సీఎం గారూ.. మా గోడు కూడా వినండి..
AP CM YS Jagan ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ టెక్నికల్ (కమెర్షియల్) ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ ( APTCIA) ప్రతినిధులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రిని నేరుగా కలిసేందుకు వీలు లేకపోవడంతో కరోనా సంక్షోభంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల ( Financial crisis) గురించి లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
Cyclone Nisarga live updates: దూసుకొస్తున్న నిసర్గ తుఫాన్... 3 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landafll ).
కరోనాపై పోరాటంలో జర్నలిస్టుల పాత్ర కీలకం.. టీఎస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Fight against COVID-19 కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టుల సేవలు మరవలేమని తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) వ్యాఖ్యానించింది. కరోనావైరస్తో ( Coronavirus pandemic ) నిత్యం ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకుని వారికి అండగా నిలబడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
AP CM YS Jagan: ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ( Amit Shah ) పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ను ( Gajendra Singh Shekhawat ) సీఎం జగన్ కలవనున్నారని తెలుస్తోంది.
Locusts attacks: మిడతల దండు దాడి నుంచి తెలంగాణ సేఫ్
Locusts swarms attacks: మిడతల దండు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పింది. మిడుతల దండు ( Locusts swarms ) తెలంగాణ సరిహద్దులకు 200 కిమీ సమీపానికి రావడంతో అవి ఏ క్షణమైనా తెలంగాణలోకి ( Telangana ) ఆ తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి ( Andhra Pradesh ) ప్రవేశిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.
Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
Watch video: నీ లెక్కెంతంటే.. నీలెక్కెంత అంటూ వాగ్వీవాదానికి దిగిన నేతలు
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.