Bank Merger: మే 1, 2025 నుండి దేశంలో ఒక రాష్ట్రం, ఒక RRB విధానం అమల్లోకి వచ్చింది . దీనిని మునుపటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ నాల్గవ దశ, దీని తర్వాత RRBల సంఖ్య ఇప్పుడు 43 నుండి 28కి తగ్గింది. ఏపీలో నాలుగు బ్యాంకులు విలీనమవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.
ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్ బీ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో బ్యాంకులు విలీనం అవుతున్నాయి. మొత్తం 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరించి ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చనున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 43 గ్రామీణ బ్యాంకులు ఉండగా ఆ సంఖ్య 28కి తగ్గిపోతుంది. దీని ప్రకారం ఏపీలో 4 బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఆ తర్వాత యూపీలో 3, పశ్చిమబెంగాల్ లో 3, బీహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2 ఆర్ఆర్బీలు విలీనం అవుతున్నాయి.
ఇక ఏపీలో ప్రస్తుతం నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. అందులో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏపీ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. కొత్త బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది.
Also Read: LPG Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధర ..ఎంత తగ్గిందంటే?
ప్రస్తుతానికి ఖాతాదారుల అకౌంట్ నెంబర్లు, ఐఎఫ్ ఎస్ సీ కోడ్, బ్రాంచ్ చిరునామాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. పాత చెక్ బుక్స్, పాస్ బుక్స్ ఏటీఎం కార్డులను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే వీలైనంత త్వరగా తమ పాస్ బుక్, కార్డులు, చెక్ బుక్స్ ను మార్చుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఏదైనా సందేహం ఉన్నట్లయితే బ్యాంక్ బ్రాంచును సంప్రదించవచ్చని కోరుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో పనిచేస్తున్న బంగియా గ్రామీణ వికాస్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకు, ఉత్తరబంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశారు.దేశంలోని 8 రాష్ట్రాలలో - బీహార్, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు రాజస్థాన్, 2 ఆర్ఆర్ బీలు ఒక్కొక్కటిగా విలీనం అయ్యాయి. దక్షిణ బీహార్ గ్రామీణ బ్యాంకు, ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బీహార్ గ్రామీణ బ్యాంకు ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం పాట్నాలో ఉంటుంది. గుజరాత్లో, బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్, సౌరాష్ట్ర గ్రామీణ బ్యాంక్లను విలీనం చేసి గుజరాత్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ ప్రకారం, అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రూ. 2,000 కోట్ల అధీకృత మూలధనాన్ని కలిగి ఉంటాయి.
Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ఏకంగా రూ. 5000 తగ్గింది.. నేటి తాజా ధరలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









