)
Pahalgam Attack Update: భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే పాకిస్థాన్ కు భారతదేశం బలమైన జవాబు ఇస్తుందని సూచనలు కనిపిస్తున్నాయి. పహల్గాం దాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాయాది దేశం పాల్పడుతున్న తీవ్రవాద చర్యలకు గట్టి జవాబు ఇస్తామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు సంకేతాలు పంపారు. తాజాగా పాకిస్తాన్ కు తగిన సమాధానం ఇచ్చే సూచన కనిపిస్తున్న ఐదు ముఖ్యమైన పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ భేటీ:
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్లతో ప్రధాని నరేంద్ర మోడీ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వారికి ఏది సబబు అనిపిస్తే ఆ పని చేయమని, ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి భేటీలు ఎక్కువగా ఒక పెద్ద ఆపరేషన్ (Operation) ముందు జరుగుతుంటాయని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ భేటీలో దాడి ఎప్పుడు, ఎలా చేయాలి అనేది ఆర్మీనే డిసైడ్ చేయాలని మోడీ సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. .
సహనాన్ని బలహీనతగా భావించవద్దని మోడీ వార్నింగ్:
మనం సహనాన్ని అదేవిధంగా ఓపికను బలహీనతగా తీసుకోవద్దని గతంలో ఉరి, పుల్వామా దాడి అనంతరం స్ట్రాంగ్ రియాక్షన్ (Surgical Strike, Air Strike) ఇచ్చామని తెలిపారు. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు.
CCS (క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) నిర్ణయాలు వేగవంతం:
గతంలో తీవ్రవాదుల దాడి జరిగిన వెంటనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS మీటింగ్ ఏర్పాటు చేసి వెంటనే పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఇదే విధంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో ఇలాగే భేటీ జరగగా, అందులో కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధాని మోదీ మరోసారి CCS మీటింగ్ జరిపే ప్లాన్ లో ఉన్నారు అంటే ప్రభుత్వం ఈ విషయం పట్ల ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోచ్చు. .
మోడీ – ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ కూడా ఓ పెద్ద సంకేతం:
ప్రధాని నరేంద్ర మోడీ అదే విధంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సైతం మాట్లాడినట్లు తెలుస్తోంది. మోడీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కలిసి ప్రైవేట్ గా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి భేటీలు జరుగుతుంటాయి. గతంలో ఆర్ఎస్ఎస్ తీవ్రవాదంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ ఇచ్చింది.
సర్వపక్ష సమావేశం – ప్రతిపక్షాలతో భేటీ:
రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. ఈ భేటీలో ప్రతిపక్షాలన్నీ ఒకే మాట స్పష్టం చేశాయి,టెర్రరిజం ఏ రూపంలో ఉన్న అణిచివేసేందుకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe