)
AP DSC Final List: ఏపీలోని కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ నియామకాలు ముగింపు దశకు చేరుకున్నాయి. డీఎస్సీ-2025లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను సంబంధిత జిల్లాలకు పంపించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 1,074 పోస్టులు నోటిఫై చేయగా, వాటిని మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు.
ఈలోగా పాఠశాల విద్యాశాఖలో 1,035 పోస్టులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 32, జువనైల్ వెల్ఫేర్ విభాగంలోని పాఠశాలల్లో 7 పోస్టులకు ఎంపికైన జాబితాలు జిల్లా విద్యాశాఖకు చేరాయి. ఇవి మరోసారి పరిశీలన తర్వాత సంబంధిత శాఖల జిల్లా అధికారుల ఆమోదానికి పంపించారు. మున్సిపల్ పోస్టులకు రీజనల్ డైరెక్టర్, జిల్లా పరిషత్ పోస్టులకు డీఈవో/జడ్పీ సీఈవో, గిరిజన సంక్షేమ పోస్టులకు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, జువనైల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధిత జిల్లా అధికారి సంతకాలు చేయాల్సి ఉంటుంది.
ఈ జాబితాలపై తుది ఆమోదం తీసుకున్న తర్వాతే కాకినాడ ఆర్జేడీ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్కు సమర్పిస్తారు. ఈ ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తి కానుంది. అనంతరం సోమవారం నుంచి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల కోసం 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ స్వీకరించి, 19న నియామక పత్రాలు జారీ చేయనున్నారు. కొత్త టీచర్లు 20, 21 తేదీల్లో తమకు కేటాయించిన పాఠశాలల్లో హాజరు కావాల్సి ఉంటుంది. దసరా సెలవుల్లో శిక్షణ కార్యక్రమం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
నియామక పత్రాల అందజేత 19న విజయవాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రతి అభ్యర్థితోపాటు ఒక సహాయకుడిని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,150 మందికి వసతి, భోజనం, అల్పాహారం వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 50 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. మొదట ఫంక్షన్ హాళ్లను అనుకున్నా, అధిక అద్దె కారణంగా చివరికి ఏలూరులోని 9 పాఠశాలల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా 18, 19 తేదీల్లో ఆ పాఠశాలల్లో తరగతులు జరగకపోవచ్చు.
డీఎస్సీకి ఎంపికైన 16 వేల మంది అభ్యర్థులు, వారి సహాయకులతో కలిపి సుమారు 32 వేల మంది 19న వెలగపూడిలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వ పార్టీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం లక్ష మందికి పైగా పాల్గొనే భారీ సభగా ఇది నిలుస్తుందని భావిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఒకేసారి నియామక పత్రాలు, ప్రమాణ స్వీకారం నిర్వహించినట్లు, ఈసారి కూడా ప్రభుత్వం అదే తరహా ప్రణాళికలు వేసిందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.