)
Free Treatment: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజన (Ayushman Bharat Scheme) నిజంగా కోట్లాది కుటుంబాలకు వరంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఈ స్కీమ్ పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆపరేషన్లు, పెద్ద చికిత్సలు లక్షల్లో ఖర్చవుతుంటాయి. కానీ ఆయుష్మాన్ కార్డ్ ఉంటే అదే ట్రీట్మెంట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందుతుంది.
అయితే చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఈ రూ. 5 లక్షల పరిమితి ఒక్కసారేనా? లేక చిన్న చిన్న చికిత్సల కోసం పలుమార్లు వాడుకోవచ్చా? చాలా మందిలో ఉంది. ఈ సందేహాలకు సమాధానం చెప్పింది ప్రభుత్వం. ఈ రూ. 5 లక్షలు మొత్తం ఒక ఏడాది లిమిట్ ఉంటుంది. అంటే, ఒకేసారి ఖరీదైన ఆపరేషన్ కోసం రూ. 5 లక్షలు వాడుకోవచ్చు. లేదంటే పలుమార్లు చిన్న చిన్న చికిత్సల కోసం వాడుకోవచ్చు. ఉదాహరణకు ఒకసారి రూ. 60,000 ఖర్చు అయితే, తర్వాత మరోసారి రూ. 1,20,000 ఖర్చు అవుతుంటే, ఇవన్నీ కలిపి వార్షిక పరిమితి రూ.5 లక్షలు దాటకపోతే ఎన్ని సార్లయినా ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ ఏడాదిలోనే రూ. 5 లక్షలు పూర్తయిన తర్వాత మిగిలిన ఖర్చులు మాత్రం మీ జేబు నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ లిమిట్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే లిమిట్ రీసెట్ అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం మళ్లీ కొత్తగా రూ. 5 లక్షల ప్రయోజనం మీకు అందుతుంది. ఇది నిజంగా పేద కుటుంబాలకు గొప్ప ఊరట అని చెప్పవచ్చు.
ఈ పథకంలో ప్యానెల్లో ఉన్న ఆసుపత్రులలో ఎవరైనా ఆయుష్మాన్ కార్డ్ చూపించి ఉచిత చికిత్స పొందవచ్చు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అందువల్ల కిడ్నీ, హార్ట్, కేన్సర్ లాంటి పెద్ద వ్యాధులు వచ్చినా ఈ కార్డ్ తో ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఉదాహరణకు హార్ట్ సర్జరీకి రూ. 3 లక్షలు ఖర్చయినా, మిగిలిన రూ.2 లక్షలను ఆ ఏడాదిలో ఇంకో చికిత్స కోసం వాడుకోవచ్చు. ఇప్పటికీ ఈ కార్డ్ తీసుకోని వారు వెంటనే అప్లై చేయడం చాలా అవసరం. ఎందుకంటే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కార్డ్ లేకపోతే మీ జేబు నుంచే లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ కార్డ్ ఉంటే అదే ఖర్చు సున్నాగా మారిపోతుంది.
మొత్తానికి ఒకేసారి గానీ పలుమార్లు గానీ, సంవత్సరానికి రూ. 5 లక్షల వరకూ ఉచిత చికిత్స పొందే అద్భుత అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఇది నిజంగా పేదలకు ఆశీర్వాదమే అని చెప్పవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆయుష్మాన్ కార్డ్ అప్లై చేసి మీ కుటుంబ ఆరోగ్య భద్రతను సురక్షితం చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.