
Bank of Baroda: దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్ అందించింది. రుణగ్రహీతలపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు బ్యాంక్ కొన్ని కాలపరిమితులపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇప్పటికే హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి ఈఎంఐ భారీగా భారం తగ్గనుంది.
బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) లో కోత విధించింది. ఇందులో భాగంగా ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ పై 10 బేసిస్ పాయింట్లు, మూడు నెలల ఎంసీఎల్ఆర్ పై 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో రేపటి నుంచి రుణాలు తీసుకున్నవారు తక్కువ వడ్డీతో చెల్లింపులు చేయగలరు.
గత వారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 5.5 శాతంతో యథాతథంగా కొనసాగించారు. అయితే ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకపోయినా, బ్యాంక్ ఆఫ్ బరోడా స్వతంత్రంగా వడ్డీ రేట్లను తగ్గించడం విశేషంగా మారింది. దీని వల్ల రుణాలు తీసుకున్న కస్టమర్లకు మరింత లాభం కలగనుంది.ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు 7.85 శాతం నుంచి 8.80 శాతం మధ్య ఉన్నాయి.
తాజా నిర్ణయంతో, ఓవర్నైట్ రుణాల వడ్డీ రేటు 7.85 శాతం, ఒక నెల రుణాల రేటు 7.95 శాతం, మూడు నెలల రుణాల రేటు 8.20 శాతం, ఆరు నెలల రుణాల రేటు 8.65 శాతం, అలాగే ఒక సంవత్సరం కాలపరిమితి రుణాల రేటు 8.80 శాతం గా కొనసాగనున్నాయి. ఈ రేట్లు అన్ని రకాల రుణాలకు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
బ్యాంక్ వడ్డీ రేట్లలో వచ్చిన ఈ తగ్గింపు రుణగ్రహీతలకు పెద్ద ఊరట కలిగించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, కొత్తగా హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.