Stock Pick: బంగారం లాంటి స్టాక్... రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 15 లక్షలు చేసిన బంపర్ స్టాక్ ఇదే..

Stock Pick:  స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు షేర్లు అనేవి లాటరీ టికెట్ల కన్నా ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంటాయి. అలాంటి షేర్లను మల్టీ బ్యాగర్స్ అంటారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ఓ సంస్థ షేరు ఇన్వెస్టర్లకు 15 రెట్ల లాభాన్ని అందించింది అలాంటి ప్రభుత్వ రంగ సంస్థ షేర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Apr 24, 2025, 02:58 PM IST
Stock Pick: బంగారం లాంటి స్టాక్... రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 15 లక్షలు చేసిన బంపర్ స్టాక్ ఇదే..

Stock Pick:  కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం  సుస్థిరమైనటువంటి విధానాల వల్ల రక్షణ రంగం  అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా  ప్రభుత్వ రంగ సంస్థలను  సమర్థవంతంగా పనిచేసేలా వాటికి సరిపడా నిధులు సమకూర్చి  పబ్లిక్ లిస్టింగ్ ద్వారా  అదనపు నిధులను సైతం  విస్తరణ కోసం వినియోగిస్తోంది.  

ఇటీవల కాలంలో  హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఐపీఓ అనంతరం  మల్టీ బాగర్ స్టాక్ గా నిలిచి చక్కటి లాభాలను అందించింది.  అదే కోవలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత్ డైనమిక్ లిమిటెడ్ బి డి ఎల్ సైతం  ఐపీఓ అనంతరం  భారీ లాభాలను అందిస్తోంది. 1970లో హైదరాబాద్‌లో ఏర్పడిన ఈ సంస్థ, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ కంపెనీ కంపెనీ ప్రత్యేకత  విషయానికి వచ్చినట్లయితే గైడెడ్ మిసైల్స్, ఇతర రక్షణ పరికరాల తయారీలో  నైపుణ్యం సంపాదించింది. 

2000లో భారత ప్రభుత్వం BDLకి Mini-Ratna – Category – I హోదాను  అందించింది.  2018 సంవత్సరంలో  బీడీఎల్ సంస్థ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది.  2018 మార్చి నెలలో  బీడీఎల్ స్టాక్ ధర కేవలం 190 రూపాయలు మాత్రమే.  సరిగ్గా ఏడు సంవత్సరాల అనంతరం ఈ స్టాక్ ధర 634 శాతం అభివృద్ధి చెంది 1433 రూపాయలకు చేరుకుంది. 2024 జూలై నెలలో ఈ స్టాక్ రూ. 1794 వద్ద  ఆల్ టైం రికార్డును సృష్టించింది.  బీడీఎల్  షేర్ ధర 2020  సంవత్సరంలో ఒక దశలో 100 రూపాయలకు దిగి వచ్చింది. 

Also Read:  IAS Success Story: మొబైల్ ముట్టుకోలేదు...భగవద్గీతనే నమ్ముకున్నా.. సివిల్స్ 11వ ర్యాంక్ సాయి శివాని సక్సెస్ సీక్రెట్ ఇదే  

ఆ సమయంలో ఎవరైతే ఒక లక్ష రూపాయలు  ఈ షేర్ మీద ఇన్వెస్ట్ చేశారో  వారికి దాదాపు 15 లక్షల రూపాయలు దక్కి ఉండేవి.  అంటే 15 రెట్లు పెరిగింది అని అర్థం.  భారత రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈ క్రమంలో బీడీఎల్ సంస్థకు చక్కటి లభించే అవకాశం కనిపిస్తోంది. 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో  కంపెనీ రెవెన్యూ 2369 కోట్ల రూపాయలుగా ఉండగా, నెట్ ప్రాఫిట్ 613 కోట్ల రూపాయలుగా ఉంది. 

ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ. 537 కోట్లుగా ఉంది. అలాగే షేర్ పాటార్న్ చూస్తే  ప్రొమోటర్లకు 74.93%, పబ్లిక్/రిటైల్ ఇన్వెస్టర్లకు 13.26%, , FIIs 3.09%, DIIs  8.70% వాటాలను కలిగి ఉన్నారు. ఇటీవల  భారత నౌకాదళానికి Medium-Range Surface-to-Air Missiles (MRSAM) సరఫరా కోసం రూ. 2,960 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన కంపెనీ ఆర్డర్ బుక్ బలంగా ఉన్నట్లు గమనించవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News