)
Central Government: రైతుల భారం తగ్గించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 12 శాతం నుంచి 18 శాతం వరకు పన్ను చెల్లిస్తున్న ఎరువులు, వ్యవసాయ రసాయనాలపై ఇకపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ అమలు చేయనుంది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో రైతులు పంటల సాగులో ఉపయోగించే ముఖ్యమైన ఇన్పుట్స్ తక్కువ ధరకు దొరకడంతో వారి వ్యవసాయ ఖర్చులు భారీగాతగ్గనున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, దీని వలన రైతుల ఉత్పత్తి ఖర్చులు తగ్గి, పంట దిగుబడులు పెరిగే అవకాశముంది.
రైతులు ఎక్కువగా ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమోనియా వంటి రసాయనాలు ఎరువుల తయారీకే కాకుండా పంటల నాణ్యత, దిగుబడి పెంపులోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఉత్పత్తులు మార్కెట్లో అధిక ధరలకు లభించడంతో రైతులు ఇంతవరకు ఇబ్బందులు పడుతుండేవారు. కానీ ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో వీటి ధరలు నేరుగా పడిపోతాయి.దీంతో రైతులు తక్కువ ఖర్చుతోనే ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేయవచ్చు.
ఇక బయో-పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, సస్టైనబుల్ వ్యవసాయం, ఆర్గానిక్ పద్ధతుల వైపు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "గ్రీన్ అగ్రికల్చర్" కార్యక్రమానికి ఈ నిర్ణయం బలాన్ని ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీఎస్టీ తగ్గింపు వల్ల రైతుల ఇన్పుట్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా చిన్న రైతులు, మధ్య తరహా రైతులకు ఇది ఒక పెద్ద ఊరటగా మారనుంది. ఎరువులు, రసాయనాలు తక్కువ ధరలకు లభించడం వలన అగ్రి-బిజినెస్ రంగానికి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఎందుకంటే తక్కువ ధరలతో ఇన్పుట్స్ లభిస్తే రైతులు ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయగలరు, దీని వలన మార్కెట్ విస్తరణ జరుగుతుంది.
వ్యవసాయ ఖర్చులు తగ్గితే, పంటల ఉత్పత్తి పెరగడం సహజం.అయితే రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎకరాల్లో పంట సాగు చేయగలరు. దీని వలన చివరికి వినియోగదారులకు కూడా లాభం కలుగుతుంది. తక్కువ ధరలతో ఆహార ధాన్యాలు అందుబాటులోకి రావడంతో మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మొత్తం మీద, జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం రైతుల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, భారతదేశ వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.