Mukesh Ambani: ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‎కు పెరుగుతున్న ఇబ్బందులు.. ఏకంగా రూ. 24,000 కోట్లు

Mukesh Ambani: ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీకి కష్టాలు మొదలయ్యాయి. భారత ప్రభుత్వం ఆయన కంపెనీకి $2.81 బిలియన్ల (సుమారు రూ. 24,522 కోట్లు) డిమాండ్ నోటీసు పంపింది. ఈ నోటీసును పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.  

Written by - Bhoomi | Last Updated : Mar 4, 2025, 06:02 PM IST
Mukesh Ambani: ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‎కు పెరుగుతున్న ఇబ్బందులు.. ఏకంగా రూ. 24,000 కోట్లు

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ కంపెనీకి 2.81 బిలియన్ డాలర్లు అంటే రూ.24,522 కోట్ల డిమాండ్ నోటీసు పంపింది. ఈ నోటీసును పెట్రోలియం,  సహజ వాయువు మంత్రిత్వ శాఖ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పంపింది. ఈ కేసు ONGC బ్లాక్ (KG-D6) కు సంబంధించింది. రిలయన్స్ ONGC బ్లాక్ నుండి గ్యాస్‌ను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అంతర్జాతీయ కోర్టుకు చేరింది. ఆ తర్వాత అంతర్జాతీయ మధ్యవర్తి 2018లో రిలయన్స్ నేతృత్వంలోని కన్సార్టియంకు అనుకూలంగా $1.55 బిలియన్ల తీర్పును ఇచ్చింది.

Add Zee News as a Preferred Source

Also Read: Today gold Rate: బంగారం భారీగా తగ్గుతోంది.. రికార్డు స్థాయి నుంచి 4వేలు తగ్గింపు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? 

ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ వాదనను రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యతిరేకించింది. జూలై 2018లో, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కూడా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ మే 2023లో కొట్టివేసి, ఆర్బిట్రేషన్ అవార్డును సమర్థించింది. అయితే, గత నెలలో, హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను పక్కన పెట్టి రిలయన్స్,  దాని భాగస్వాములకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీని తరువాత ప్రభుత్వం కొత్త డిమాండ్ నోటీసులు పంపింది.

Also Read: Supreme Court: గడువు ముగిసేవరకు ఆగుతారా, ఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

ప్రభుత్వం పంపిన నోటీసుతో ఈ రోజు  ఆ కంపెనీకి చెందిన  షేర్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. 1శాతం క్షీణతతో, ఇది రూ.1160 శ్రేణిలో ట్రేడవుతోంది. మార్చి 3న, ఇది కొత్తగా 52 వారాల కనిష్ట స్థాయి రూ.1156ని నమోదు చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News