)
EPFO 3.0 Digital Service: దీపావళి పండుగ ముందు ఈపీఎఫ్ఓ చందాదారులకు భారీ గిఫ్ట్ రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ డబ్బును నేరుగా ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునే ఛాన్స్ కల్పించాలన్న ఆలోచనలో ఉంది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అక్టోబర్ 10-11 తేదీల్లో కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు భారీ ఉపశమనం లభించనుంది.
కొత్త డిజిటల్ సర్వీస్ EPFO 3.0:
పీఎఫ్ ఖాతాదారుల సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ త్వరలోనే EPFO 3.0 అనే డిజిటల్ సర్వీస్ను ప్రారంభించబోతుందన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఖాతా వివరాలు సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశము కూడా కలుగుతుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేక ఏటీఎం కార్డును కూడా జారీ చేస్తుంది. ఇది ఫీఎఫ్ అకౌంట్ కు లింక్ అయి ఉంటుంది. అదే విధంగా పీఎఫ్ అకౌంట్ ను యూపీఐకి లింక్ చేస్తే, చందాదారులు డబ్బును తమ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
పెన్షన్ పెంపు ప్రతిపాదన:
ఈ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కనీస పెన్షన్ పెంపుపై ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ. 1,000గా ఉన్న కనీస పెన్షన్ను రూ. 1,500 నుంచి 2,500 వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది.
ఉద్యోగం కోల్పోతే PF విత్డ్రా రూల్స్:
పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రూల్స్ కూడా ఉన్నాయి. ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే, ఒక నెల తర్వాత తన పీఎఫ్ అకౌంట్ నుంచి 75శాతం డబ్బు తీసుకోవచ్చు. మిగిలిన 25శాతంను రెండు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు తక్కువ అవుతాయి.
పన్ను మినహాయింపు సదుపాయం:
పీఎఫ్ విత్డ్రా చేసినప్పుడు ఆదాయపు పన్ను కూడా ఒక కీలక అంశమని చెప్పవచ్చు. ఒక ఉద్యోగి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సర్వీస్ చేసి ఉంటే, పీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకున్నా అతనికి పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఈ 5 సంవత్సరాల కాలం ఒకే కంపెనీలో కాకుండా, వేర్వేరు సంస్థల్లో చేసిన ఉద్యోగాన్ని కలిపి లెక్కించుకోవచ్చు.
మొత్తానికి దీపావళికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే పీఎఫ్ ఖాతాదారులకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది. ఏటీఎం, యూపీఏ ద్వారా డైరెక్ట్ విత్డ్రా సౌకర్యం రావడం వల్ల డబ్బు అందుబాటులోకి రావడం మరింత సులభం అవుతుంది. అలాగే కనీస పెన్షన్ పెంపు కూడా అమల్లోకి వస్తే, ఉద్యోగులు రిటైర్డ్ వ్యక్తులు రెండింటికీ పెద్ద రిలీఫ్ లభిస్తుందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.