)
EPS 95 Pension Hike: దేశవ్యాప్తంగా లక్షలాది ఈపీఎస్ 95 పెన్షన్ దారులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. మినిమం పెన్షన్ను రూ 1,000 నుండి కనీసం రూ. 7,500 వరకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ తో జీవనం కొనసాగించడం చాలా కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఔషధ వ్యయాలు, గృహావసరాలు తీరడంలేదని పెన్షనర్లు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజానికి, మినిమం పెన్షన్ పెంపు అంశం అనేది కొత్తది కాదు. ప్రతి బడ్జెట్ ముందు ఈ అంశంచర్చకు వస్తుంది. పెన్షనర్ల సంఘాలు పలు మార్లు నిరసనలు కూడా చేపట్టాయి. 2018లోనూ 2020లోనూ పెద్ద ఎత్తున పోరాటాలే జరిగాయి. అయినా, ఇప్పటి వరకు మినిమం పెన్షన్ రూ.1,000 వద్దే కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పెన్షనర్ల సంఘాలు కలసి తమ డిమాండ్లను తెలియజేశాయి. అంతేకాదు ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పడి పరిస్థితులను సమీక్షించింది. కమిటీ స్పష్టంగా మినిమం పెన్షన్ పెంచాల్సిన అవసరముందని, పెన్షనర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం పెన్షనర్ల ప్రధాన డిమాండ్ మినిమం పెన్షన్ను రూ7,500 చేయడం సబబే అని చెప్పింది. అయితే కొన్ని సంఘాలు ఆ మొత్తాన్ని రూ. 9,000కి పెంచాలని కూడా కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదనల్లో, కనీసం రూ. 3,000 వరకు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
పెన్షనర్లు చెబుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే రూ. 1,000తో ఈ రోజుల్లో ఎలా జీవించగలమని ప్రశ్నిస్తున్నారు. అద్దె ఇళ్లు, కూరగాయల ధరలు, వైద్య ఖర్చులు, విద్యుత్ బిల్లులు అన్నీ పెరిగిపోయాయి. ఒకప్పుడు రూ. 1,000తో చిన్నచిన్న అవసరాలు తీరేవి కావచ్చు కానీ ఇప్పుడు అది అసలు సరిపడదని వారు చెబుతున్నారు. అందుకే తమ డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని పెన్షనర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మరోసారి దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 8వ పే కమిషన్ తరహాలోనే ఈపీఎస్ 95 విషయంలో కూడా కేంద్రం ప్రత్యేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంచితే, దేశవ్యాప్తంగా 65 లక్షలకుపైగా పెన్షనర్లకు ఉపశమనం లభిస్తుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. అయితే పెన్షనర్లు మాత్రం ఈ సారి తప్పకుండా ఒక సానుకూల ఫలితం వస్తుందనే ఆశతో ఉన్నారని చెప్పుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.