)
Equity vs Gold vs FD: కష్టపడి సంపాదించిన డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఏది బెస్ట్ ఆప్షన్ అనే సందేహం ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడి పెడితేనా, గోల్డ్లోనా లేక ఫిక్స్డ్ డిపాజిట్లలోనా అనే ప్రశ్న చాలా మందిని గందరగోళంలోకి నెట్టేస్తుంది. రిస్క్ తక్కువ..ఆదాయం ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ దీర్ఘకాలికంగా మంచి రాబడులు కావాలనుకునేవారు ఈక్విటీ లేదా గోల్డ్ను బెస్ట్ ఆప్షన్ గా పరిగణిస్తుంటారు. అయితే గత దశాబ్ద కాలం డేటాను పరిశీలించినట్లయితే ఈ మూడు పెట్టుబడి ఆప్షన్లలో లాభాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది.
గత 10ఏళ్లుగా పసిడి ధరలు భారీగా పెరిగిపోయాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. పలు గణాంకాల ప్రకారం చూసినట్లయితే గోల్డ్ ఫండ్స్ లేదా ETFలు సగటున 13 శాతం వార్షిక లాభాలను అందించాయని పేర్కొన్నాయి. 2015లో ఒకరు రూ. 1 లక్షను బంగారంలో పెట్టుబడి పెడితే, ప్రస్తుతం అది దాదాపు రూ. 3.5 లక్షలకు పెరిగి ఉండేది. ద్రవ్యోల్బణం సమయంలో కూడా పసిడి విలువ నిలకడగా ఉండటం వలన చాలా మంది ఇన్వెస్టర్లు గోల్డ్ను సేఫ్ ఆప్షన్గా భావిస్తుంటారు.
ఈక్విటీ విషయానికొస్తే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ రాబడులు కూడా భారీగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 50 సూచీ పనితీరును గమనిస్తే గత పదేళ్లలో సగటున 13.6 శాతం రాబడి ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే 10 సంవత్సరాల క్రితం రూ. 1 లక్ష షేర్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇప్పుడు దాని విలువ రూ. 3.58 లక్షలకు పెరిగి ఉండేది. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఈక్విటీ ఒక శక్తివంతమైన ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. కానీ మార్కెట్ వోలటిలిటీని తట్టుకునే సహనం ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఇక ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికి వస్తే, ఇది అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చెబుతుంటారు. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక అని చెప్పవచ్చు. 2015లో రూ. 1 లక్షను 8.25శాతం వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టి ఉంటే, ప్రస్తుతం దాని విలువ రూ. 2.26 లక్షలకు మాత్రమే ఉండేది. రాబడులు తక్కువైనా, భద్రత కోరుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు విశ్వసనీయమైన పెట్టుబడిగా ఉంటాయని చెప్పవచ్చు.
మొత్తంగా చూస్తే ఈక్విటీ, గోల్డ్ రెండూ దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించగా, ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రం తక్కువ లాభాలను అందించాయని చెప్పుకోవచ్చు. కానీ ఎఫ్డీలో రిస్క్ లేని భద్రత ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ రిస్క్ భరించే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా డైవర్సిఫికేషన్ పద్ధతిని అనుసరిస్తే రిస్క్ తగ్గి, రాబడులు మెరుగ్గా వస్తాయని నిపుణులు సైతం చెబుతున్నారు.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.