Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?

Gold Rate: బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా ధర భారీగాపెరగడంతో దేశీయంగానూ పసిడికి రెక్కలు వచ్చాయి.  24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర లక్ష మార్క్ ను టచ్ చేసింది. అటు వెండి సైతం బంగారంతో పోటీ పడుతోంది.   

Written by - Bhoomi | Last Updated : Apr 22, 2025, 08:56 AM IST
Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?

Gold Rate: బంగారం ధర భారీగా పెరుగుతూ భయపెడుతోంది. పెళ్లిళ్ల సీజన్ లో రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్యులకే కాదు సంపన్నులకు కూడా చుక్కలను చూపిస్తోంది. గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం తర్వాత పసిడి ధర అమాంతం పెరిగిపోయింది. తాజాగా 24 క్యారెట్లు,22క్యారెట్ల బంగారం ధరలు ఇప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను బద్దలు కొట్టింది. బంగారం ధరలు సామాన్యుల ఊహకు కూడా అందనంత ఎత్తుకు పెరిగాయి. 

Add Zee News as a Preferred Source

నేడు మంగళవారం బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. బంగారం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,000 దాటే రోజు కూడా ఎంతో దూరంలో లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేడు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 1400 పెరిగింది. ఇది సాధారణ కొనుగోలుదారుల ఆందోళనను పెంచింది. 

నేటి ధర గురించి మాట్లాడుకుంటే 24క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 99,600కి చేరుకుంది. రూ. లక్షకు కాస్త దూరంలో నిలిచింది. అటు వెండి కూడా కిలో రూ. 98వేలుగా ఉంది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో భారీ గందరగోళం నెలకొందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు సురక్షితమైన ఎంపిక మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా దాని ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 

కాగా బంగారంపై పన్ను కూడా కలుపుకుంటే బంగారం ఇప్పటికే రూ. 1లక్ష దాటిందని నిపుణులు అంటున్నారు. ఈ వాణిజ్య యుద్ధం త్వరగా ముగియకపోతే..ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏదైనా కొనుగోళ్లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుందంటున్నారు. పెళ్లికోసం బడ్జెట్ వేసుకున్నవారు ఇప్పుడు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఆకస్మిక పెరుగుదల అసాధారణ మధ్యతరగతి కుటుంబాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

Also Read: School Holidays: ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు.. టీచర్లకు విద్యాశాఖ కీలక సూచనలు..  

ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగిపోయింది. దీని కారణం దేశాల మధ్య సంఘర్షణ మాత్రమే కాదు.. బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, బలహీనమైన డాలర్ కూడా కారణంగా చెప్పువచ్చు. ప్రపంచంలో ఏదీ బాగాలేనప్పుడు లేదా పరిస్థితి మరింత దిగజారిపోతుందని ప్రజలు భయపడినప్పుడు వారు తమ డబ్బునున బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్లు బంగారాన్ని అత్యంత సురక్షితమైందని భావిస్తారు. అందువల్ల చాలా మంది ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు  చేస్తున్నారు. దీని వల్ల దాని ధర మరింత పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలో అలాంటి భయం కొనసాగితే..బంగారం మరింత ఖరీదైంది కావచ్చు. అందుకే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే బంగారం కొనమని ప్రజలకు చెబుతున్నారు. తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం సరైంది కాదని సూచిస్తున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News