Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏప్రిల్ 25, శుక్రవారం బంగారం ధరలు ఇవే

Gold Rate Today: బంగారం ధరలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న డిమాండ్ కూడా కారణం అవుతుందని చెప్పవచ్చు. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Apr 25, 2025, 09:43 AM IST
Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏప్రిల్ 25, శుక్రవారం బంగారం ధరలు ఇవే

Gold Rate Today: ఏప్రిల్ 25 శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,230  పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,040  పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,10,800  పలికింది. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతూ ఒక లక్ష రూపాయలు దాటిన పసిడి ధరలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధరలు తగ్గడానికి అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం చైనా తో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్టు వార్తలు వస్తున్నాయి. దిగుమతి సుంకాలపై  ట్రంప్   పలు దేశాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా  స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులు  గతంలో బంగారం వైపు పెద్ద ఎత్తున తరలించారు. మళ్లీ బంగారం నుంచి డబ్బులు ఉపసంహరించి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. 

దీంతో బంగారం ధర తగ్గడం గమనిస్తున్నాము. అయితే ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేక స్వల్పకాలిక రిలీఫ్ అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే ప్రస్తుతం అమెరికా మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది ఒక ఔన్స్ బంగారం ధర 3200 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా కూడా తగ్గడం ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా హిందువులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు.  

Also Read:  IAS Success Story: మొబైల్ ముట్టుకోలేదు...భగవద్గీతనే నమ్ముకున్నా.. సివిల్స్ 11వ ర్యాంక్ సాయి శివాని సక్సెస్ సీక్రెట్ ఇదే  

ఈ పవిత్ర పర్వదినాన బంగారం కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల కోసం ఈ సంవత్సరం గిరాకీ చాలా తగ్గుతుందని  ఆభరణాల దుకాణాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ అక్షయ తృతీయ కు బంగారం ధర భారీగా పెరిగింది.  గత సంవత్సరం ఇదే బంగారం ధర కేవలం 70 వేల రూపాయల సమీపంలోనే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం దాదాపు లక్ష రూపాయల సమీపానికి చేరింది.  2024 నుంచి 2025 సంవత్సరాల మధ్య కాలంలో  బంగారం ధర భారీగా పెరుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి రిలీఫ్ పసిడి ప్రియులకు కాస్త ఊరట లభిస్తుంది అని చెప్పవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News