)
Good News For Govt Teachers: ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ఉపాధ్యాయులకు ఒక శుభవార్తను అందించారు. దీపావళికి ముందే ఉపాధ్యాయులు, వారి కుటుంబాలకు నగదు రహిత వైద్య చికిత్స (Cashless Medical Facility) అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులలో హర్షం వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, సుమారు 11 లక్షల మంది ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కలిపి 60 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా ఈ సదుపాయాన్ని పొందడానికి ఉపాధ్యాయులు ఎటువంటి సహకారం లేదా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఈ సేవ పూర్తిగా ఉచితం అని పేర్కొంది.
ఈ నగదు రహిత వైద్య సదుపాయం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, శిక్షామిత్రులు, వంటవారు, అలాగే ప్రభుత్వేతర ఎయిడెడ్, స్వయం-ఫైనాన్స్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీని వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఉపశమనం పొందడమే కాకుండా, సకాలంలో మెరుగైన వైద్య చికిత్స పొందగలుగుతారు.
ఉపాధ్యాయుల సంఘాలు దీన్ని ఒక చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. చాలా కాలంగా నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలనే డిమాండ్ చేస్తూ వచ్చిన సెకండరీ టీచర్స్ యూనియన్ దీనిని తమ పెద్ద విజయంగా పేర్కొంది. జిల్లా అధ్యక్షుడు దేశ్రాజ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ .. మా యూనియన్ ఎన్నోసార్లు ఈ డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించింది. ఇప్పుడు అది నెరవేరింది. ఇది ఉపాధ్యాయుల జీవితంలో ఒక పెద్ద మైలురాయి అని అన్నారు.
విద్యాశాఖ మంత్రి అలోక్ పాఠక్ మాట్లాడుతూ .. ఇది ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డబ్బుల గురించి ఆందోళన లేకుండా నాణ్యమైన వైద్యం పొందగలుగుతారు. దీని వల్ల ఉపాధ్యాయుల ఆర్థిక భారం తగ్గుతుంది అని పేర్కొన్నారు. స్కౌట్ భవన్లో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇది యోగి సర్కార్ నుంచి వచ్చిన దీపావళి కానుక అని వారు అన్నారు. సభ్యులు శ్యామ్ లాల్ శాక్య, యోగేంద్ర దీక్షిత్, నాన్హే లాల్, రాజ్ కుమార్ శర్మ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఉపాధ్యాయుల ముఖాల్లో సంతోషం కనిపించింది.
మొత్తం మీద నగదు రహిత వైద్య సదుపాయం అమలులోకి రావడం ద్వారా ఉపాధ్యాయులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రతతో పాటు ఆర్థిక భరోసా లభించనుంది. దీపావళి పండుగకు ముందు వచ్చిన ఈ నిర్ణయం నిజంగానే ఉపాధ్యాయులకు ఒక మధురమైన కానుకగా నిలిచిపోనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.