GST collections in February 2025: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీ స్థాయిలో నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నెలకు గాను రూ. 1.84 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 9.1 శాతం వృద్ధి నమోదు అయ్యింది. జీఎస్టీ ఆదాయంలో దేశీయ రెవెన్యూ వసూళ్లు 10.2 శాతం మేర పెరిగి రూ. 1. 42 లక్షల కోట్లకు చేరుకుంది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 5.4శాతం వ్రుద్ధితో రూ. 41,702 కోట్లుగా నమోదు అయ్యింది.
ఫిబ్రవరి నెలకు వసూలైన మొత్తం వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ నుంచి రూ. 35,204 కోట్లు, స్టేట్ జీఎస్టీ నుంచి 43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి రూ. 90, 870 కోట్లు వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెస్సుల రూపంలో రూ. 13,868 కోట్లు సమకూరినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా రూ. .196 లక్షల కోట్లు వసూళ్లు నమోదు అయిన విషయం తెలిసిందే.
Also Read: Preity Zinta: ప్రీతిజింటాపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?
ఫిబ్రవరి 2025లో నికర GST వసూళ్లు 8.1% పెరిగి దాదాపు రూ.1.63 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే నెలలో స్థూల, నికర GST వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు, రూ.1.50 లక్షల కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్లో, ప్రభుత్వం ఈ సంవత్సరానికి GST ఆదాయంలో 11% పెరుగుదలను అంచనా వేసింది. కేంద్ర GST పరిహార సెస్తో సహా రూ. 11.78 లక్షల కోట్లు వసూలు చేసింది.
డిసెంబర్లో GST వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.3% వృద్ధిని చూపుతోంది. పండుగ సీజన్ తర్వాత వినియోగం తగ్గడం వల్ల ఇది నవంబర్లో నమోదైన 8.5% వృద్ధి కంటే తక్కువగా ఉంది.
Also Read: Zelenskyy: మాగోడు పట్టదా? జెలెన్ స్కీ ఆవేదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









