)
GST Council New Tax Slabs 2025: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, పరోక్ష పన్ను నిర్మాణంలో పెద్ద మార్పులకు ఆమోదం లభించింది. ఇకపై జీఎస్టీ కేవలం రెండు ప్రధాన స్లాబులే కలిగి ఉంటుంది. 5 శాతం, 18 శాతం అనే రెండు స్థాయిల్లోనే ఎక్కువ వస్తువులు, సేవలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న 12శాతం 28శాతం స్లాబులు తొలగించింది. ఈ మార్పుతో పన్ను వ్యవస్థ మరింత స్పష్టంగా, వినియోగదారులకు సులభంగా మారనుంది.
సిగరెట్లు, మద్యం, లగ్జరీ వస్తువులు, చక్కెర కలిగిన పానీయాలు, ఫ్లేవర్ ఉన్న డ్రింక్స్, ఏరేటెడ్ వాటర్స్ వంటి ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40శాతం పన్ను విధించనున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. తర్వాతి జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారన్నారు. జీఎస్టీలో రెండు స్లాబ్స్ మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజలను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సీతారామన్ తెలిపారు. జీఎస్టీ ఫైలింగ్ ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. చాలా ఆహార పదార్ధాలపై జీరో శాతం జీఎస్టీ ఉంటుందని తెలిపారు.
దీనివల్ల సాధారణ అవసరాలపై భారం తగ్గినా, లగ్జరీ వర్గంలోకి వచ్చే ఉత్పత్తుల ధరలు మరింత పెరగడం ఖాయం. కొత్త స్లాబులు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ఈ మార్పులు రావడం వల్ల వినియోగదారుల కొనుగోళ్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అదనపు పన్నులు లేదా కొత్త సెసులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మార్పులతో దేశానికి దాదాపు రూ. 93,000 కోట్ల వరకు ఆదాయ నష్టం కలగవచ్చని అంచనా. కానీ, లగ్జరీ, బేబీ ప్రొడక్ట్స్ పై 40శాతం పన్ను వసూలు చేయడం ద్వారా రూ. 45,000 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (MSMEs) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెద్ద మార్పు చేయనున్నారు. ఇప్పటి వరకు వారాల తరబడి సాగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీని వల్ల చిన్న వ్యాపారులు త్వరగా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు, కొత్త మార్పుల వల్ల వచ్చే ఆదాయ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలని డిమాండ్ చేశాయి. అయినప్పటికీ, తుదింగా ఈ నిర్ణయానికి ఏకగ్రీవ మద్దతు లభించింది. సమావేశంలో తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే, ఇకపై బీమా ప్రీమియాలపై జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఇది బీమా రంగానికి, పాలసీ హోల్డర్లకు ఉపశమనం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.