)
GST Council Meeting 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయాలు ఒక వైపు సామాన్య వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తే..మరోవైపు రాష్ట్రాల ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రూ.1,000 వరకు ధర ఉన్న షూస్, దుస్తువులపై 5శాతం GST ఉండేది. రూ.1,000 కంటే ఎక్కువ ధర గల వాటిపై 12శాతం పన్ను విధిస్తుండే. అయితే తాజాగా జరిగిన ఈ సమావేశంలో కౌన్సిల్ ఈ పరిమితిని రూ.2,500 వరకు పెంచింది. అంటే ఇకపై రూ.2,500 లోపు ధర ఉన్న షూస్, బట్టలు 5శాతం జీఎస్టీ శ్రేణిలోకి వస్తాయని చెప్పవచ్చు. దీని వలన ఈ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం వస్త్ర, పాదరక్షల పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం కలిగిస్తుంది.
దీంతోపాటు జీఎస్టీ కౌన్సిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12శాతం, 28శాతం పన్ను స్లాబ్లు పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వర్గంలో ఉన్న ఎక్కువ ఉత్పత్తులు 5శాతం లేదా 18శాతం శ్రేణిలోకి మార్చారు. దీని వలన పన్ను నిర్మాణం సులభతరం అవుతుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా వినియోగదారులకు ధరల పరంగా ఉపశమనం లభించగా, పరిశ్రమలకు కూడా ఈ నిర్ణయం ఊరట కలిగించిందని చెప్పువచ్చు. .
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని పలు సంస్కరణలు ఆమోదించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు ముందే నింపిన రిటర్నులు (Pre-filled Returns) అమలు అవుతాయి. వస్త్రాలు, రసాయనాలు, ఎరువులు, ఫార్మా రంగాలకు ఏడు రోజుల్లో రీఫండ్ ఇవ్వాలని కౌన్సిల్లో నిర్ణయించారు. అయితే ఈ మార్పులు వ్యాపారాలకు సమయం, ఖర్చు ఆదా చేస్తాయని చెప్పవచ్చు.
అయితే రాష్ట్రాలు మాత్రం ఈ మార్పులతో తమ ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, కొత్త పన్ను నిర్మాణం వల్ల తమ రాష్ట్ర ఆదాయం 10–12శాతం వరకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఉగ్రవాద దాడుల కారణంగా ఇప్పటికే ఆదాయ లోటు ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్కు ఇది మరింత భారమవుతుందని పేర్కొన్నారు.
అదే విధంగా జార్ఖండ్ ఆర్థిక మంత్రి రాధా కృష్ణ కిషోర్ మాట్లాడుతూ.. కొత్త జీఎస్టీ స్లాబ్ల వలన తమ రాష్ట్రానికి సుమారు రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ నష్టాన్ని కేంద్రం భర్తీ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు కూడా ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఒకవైపు సామాన్య ప్రజలకు పన్ను ఉపశమనం ఇస్తే, మరోవైపు రాష్ట్రాలకు ఆర్థిక సవాళ్లు విసురుతున్నాయని చెప్పవచ్చు. పన్ను స్లాబ్ల సరళీకరణ, చిన్న వ్యాపారాలకు సౌకర్యాలు, వినియోగదారులకు చౌక ధరలు అన్నీ పాజిటివ్గా ఉన్నప్పటికీ, రాష్ట్రాల ఆదాయ నష్టం ఎలా భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ మార్పులు మార్కెట్, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.