Earthquake in Myanmar: మయన్మార్ భూకంపాన్ని ముందుగానే హెచ్చరించిన "దేవదూత.." జపనీయుల నమ్మకాలు ఎలా ఉంటాయంటే?

Earthquake in Myanmar: సముద్ర గర్భంలో ఉండాల్సిన చేపలు అప్పుడప్పుడు తీరానికి కొట్టుకురావడం చూస్తుంటాం. కానీ జపాన్ వాసులు మాత్రం ఈ విషయాన్ని మామూలుగా తీసుకోవడం లేదు. ఓ వెండి పొలుసుల చేప వారికి నిద్ర లేకుండా చేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడ్డారు. అటు సోషల్ మీడియాలోనూ ఇదే విషయంపై జోరుగా చర్చ జరిగింది. జపాన్ వాసులు భయపడినట్లు ఇప్పుడు అదే జరిగిందా. మయన్మార్ , థాయ్ లాండ్ భూకంపాలను ఈ దేవదూత ముందే హెచ్చరించిందా. అసలు సముద్ర చేపలు భూకంపాలను ముందే పసిగడతాయా. ప్రక్రుతి విపత్తులపై జపనీయుల నమ్మకాలేంటో చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Mar 29, 2025, 05:58 PM IST
Earthquake in Myanmar: మయన్మార్ భూకంపాన్ని ముందుగానే హెచ్చరించిన "దేవదూత.." జపనీయుల నమ్మకాలు ఎలా ఉంటాయంటే?

Earthquake in Myanmar: మయన్మార్, థాయ్ లాండ్ ను వణికించిన రెండు భారీ భూకంపాల గురించి ముందే హెచ్చరికలు వచ్చాయా. త్వరలోనే భూకంపాలు, సునామీ వంటి ప్రక్రుతి విపత్తులు రానున్నాయని నెలరోజుల కిందటే జపనీయులు అనుమానించడానికి గల ఆధారాలే ఏమిటి. జపాన్ పూర్వీకులు కథలుగా చెప్పుకునే సముద్ర దేవుడి ప్యాలెస్ దూత నెలరోజుల ముందుగానే ఈ సంకేతాలను అందించిందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Add Zee News as a Preferred Source

జపనీయుల జానపద కథల్లో డూమ్స్ డే ఓర్ షిష్ కు ర్యుగు నో సుకై లేదా సముద్ర దేవుడి ప్యాలెస్ దూత అని పేరు ఉంది. 2011లో జపాన్ లోని బీచ్ లో ఇలాంటి చేపలు కొట్టుకు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది నెలలకే టోక్యోకు విధ్వంసక సునామీ వచ్చింది. నిజానికి బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్, డూమ్స్ డే వంటి చేపలు మహా సముద్రాల అగాధాల్లో జీవిస్తుంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో ఉపరితలంపై కనిపించాయి. అందులో డూమ్స్ డే ఫిష్ ఒడ్డుకు చేరి చనిపోయింది. యాంగ్లర్ షిఫ్ తక్కువ లోతులో ఈదుతూ సముద్ర పరిశోధకులకు కనిపించింది. ఇలాంటి పరిణామాలు ప్రక్రుతి వైపరీత్యాలకు దారి తీస్తుందని జపనీయుల విశ్వాసం. ఇలా  కనిపించిన గత సందర్భాల్లో సునామీ వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. 

Also Read: Gold Rate Today: ఉగాదికి ముందే దుమ్మురేపిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే పిచ్చెక్కడం ఖాయం  

 

సైన్స్ ఏం చెబుతోంది? 

లోతైన సముద్ర జీవులకు పైకి రావడం అనేది పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి  90శాతం అదనపు వేడి సముద్రం గ్రహిస్తుందని లోతైన ప్రాంతాల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడమో లేక ఆహార అన్వేషణలో భాగంగా చేపలు, ఇతర సముద్ర జంతువులు వలస వెళ్తుంటాయని తెలిపారు. ఎన్ నినో, లా నినా ప్రభావాలుకూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయని ఆ పరిస్థితి సముద్ర జీవులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తుందని వివరించారు. 

Also Read: IPL 2025: ధోనీని ఎంతైనా తిట్టుకోండి.. ఈ రికార్డు మాత్రం మీ ఫేవరెట్‌ ప్లేయర్‌ జన్మలో చేరుకోలేడు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News