Auto News: ఆటో ఇండస్ట్రీకి తీపికబురు. ఆ నిర్ణయం వైపుగా ఇండియా

Auto News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25శాతం ఆటో విడిభాగాల దిగుమతి సుంకం ప్రణాళిక ప్రభావాన్ని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశంపై గత వారం న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు సమావేశం అయ్యారు. అక్కడ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చించారు.   

Written by - Bhoomi | Last Updated : Apr 2, 2025, 07:33 PM IST
Auto News: ఆటో ఇండస్ట్రీకి తీపికబురు. ఆ నిర్ణయం వైపుగా ఇండియా

Auto News: భారతదేశం.. అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక పెద్ద అడుగు వేయవచ్చు . అమెరికన్ ఆటో విడిభాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం గురించి భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం, వీటిపై 10 శాతం నుండి 15 శాతం వరకు కస్టమ్స్ సుంకం విధిస్తున్నారు. దీని సగటు రేటు 11 శాతం. అమెరికా ఆటో విడిభాగాల ధర ఎక్కువగా ఉండటం వల్ల, వాటిపై సుంకాలను తొలగించినప్పటికీ, భారత మార్కెట్లో దేశీయ పరిశ్రమకు ఎటువంటి హాని జరగదని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Add Zee News as a Preferred Source

ఇటీవల, భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) గురించి చర్చ జరిగింది. దీనిలో ఆటోమొబైల్స్ కంటే ఆటో విడిభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రభుత్వం అధికారులు తెలిపిన ప్రకారం, భారతదేశం అమెరికా నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోని ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ అడుగు వేస్తున్నారు.

భారత్  ప్రతి ఏడాది  దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఇది మొత్తం ఎగుమతుల్లో మూడో వంతు. అదే సమయంలో భారతదేశం అమెరికా నుండి $1.5 బిలియన్ల విలువైన ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే.. అది వాణిజ్య సంబంధాలను మరింత సమతుల్యం చేయగలదు.

Also Read: Stock Market: ట్రంప్ టారిఫ్ కు భయపడేదేలే..లాభాల్లో  స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్   450 పాయింట్లు జంప్   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం ఆటో,  ఆటో విడిభాగాల దిగుమతి సుంకం ప్రణాళిక ప్రభావాన్ని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశంపై గత వారం న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు సమావేశమయ్యారు. అక్కడ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మరింత వ్యూహంపై అంగీకారం కుదిరింది. దీని కింద, రాబోయే వారాల్లో ఒక రౌండ్ వర్చువల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి దశను 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం (ACMA) ప్రకారం, భారతదేశ ఆటో కాంపోనెంట్ పరిశ్రమ 2023-24 నాటికి 9.8 శాతం వృద్ధి చెంది $74.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దేశీయ సరఫరా $62.4 బిలియన్లు కాగా, ఎలక్ట్రిక్ వాహన (EV) రంగం 6 శాతం వాటాను అందించింది. నివేదిక ప్రకారం, అమెరికన్ ఆటో విడిభాగాలపై సుంకం తొలగించినప్పటికీ, భారత పరిశ్రమ పోటీలో బలంగా ఉంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.

Also Read:  Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News