)
IPPB Notification 2025: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) గ్రామీణ డాక్ సేవక్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 29.
పోస్టుల సంఖ్య..
మొత్తం పోస్టుల సంఖ్య 348 ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి..
అభ్యర్థి వయస్సు 20 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం.. అక్టోబర్ 09.
లాస్ట్ డేట్.. అక్టోబర్ 29.
అప్లికేషన్ ఫీజు..
అప్లై చేయాల్సిన అభ్యర్థులందరూ అప్లికేషన్ ఫీజు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ippbonline.com వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎంపిక విధానం..
గ్రాడ్యుయేషన్ స్థాయిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే ఐపీపీబీ ఆన్లైన్ టెస్టు నిర్వహించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.