)
Kia Prices: భారత ఆటోమొబైల్ రంగంలో పండుగ సీజన్ ఉత్సాహంగా మారనుంది. దసరా, దీపావళికి కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్యూవీలపై జిఎస్టి రేట్లను 50 శాతం, నుండి 40 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.కేంద్రం ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు భారీ ఆర్థిక ఉపశమనం అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా తమ వినియోగదారులకు ఈ ప్రయోజనాలను నేరుగా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
కియా ఇండియా ప్రకటించిన వివరాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త జిఎస్టి రేట్ల ప్రయోజనాలు అన్ని మోడళ్లలో లభిస్తాయి. ముఖ్యంగా సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి ప్రముఖ ఎస్యూవీలపై భారీ ధరల తగ్గింపులు వస్తాయి. మోడల్ ఆధారంగా తగ్గింపులు వేరువేరుగా ఉండగా, కియా సోనెట్ గరిష్టంగా రూ. 1,64,471 వరకు తగ్గింపును అందిస్తోంది. సైరోస్ పై రూ. 1,86,003, సెల్టోస్ పై రూ. 75,372, కారెన్స్ పై రూ. 48,513, కారెన్స్ క్లావిస్ పై రూ. 78,674 తగ్గింపులు ఉన్నాయి. కియా కార్నివాల్ మాత్రం అత్యధికంగా రూ. 4,48,542 వరకు ధర తగ్గింపును పొందనుంది. ఈ తగ్గింపులు కస్టమర్లకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, పండుగ సీజన్లో కొనుగోళ్లకు మరింత ఉత్సాహం నింపనున్నాయి.
ఇంతటితో ఆగకుండా కియా, జిఎస్టి తగ్గింపులతో పాటు ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్లను కూడా ప్రకటించింది. ఇందులో తక్కువ వడ్డీ రేట్లతో ఈఎంఐలు, విస్తృత వారంటీ ప్యాకేజీలు, ఆకర్షణీయ ఎక్స్ఛేంజ్ బోనస్లు ఉన్నాయి. ఈ సౌకర్యాలు పండుగ సీజన్లో కియా వాహనాలను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కస్టమర్-ఫస్ట్ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందించడం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్వాంగు లీ తెలిపారు.
ఇక ఎంజీ మోటార్ ఇండియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ 2025 సెప్టెంబర్ 7 నుంచి తన ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ ఎస్యూవీల (Aster, Hector, Gloster) పై కొత్త జిఎస్టి రేట్ల ప్రయోజనాలను అమలు చేసింది. ఎంజీ ఆస్టర్ పై రూ. 54,000 వరకు, హెక్టర్ (పెట్రోల్/డీజిల్) పై రూ. 1,49,000 వరకు, గ్లోస్టర్ పై గరిష్టంగా రూ. 3,04,000 వరకు తగ్గింపును అందిస్తోంది. దీని ఫలితంగా ఎంజీ వాహనాలు కూడా పండుగ సీజన్లో మరింత సరసమైన ఎంపికలుగా మారాయి.
ఎంజీ మోటార్ ఇండియా కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా మాట్లాడుతూ.. ఈ జిఎస్టి తగ్గింపు వాహనాల సరసత సమస్యను పరిష్కరిస్తుందని, కస్టమర్లకు తక్షణ విలువను అందిస్తుందని తెలిపారు. అదనంగా ఎంజీ ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించింది. ఇందులో ఆన్-రోడ్ ఫండింగ్, మూడు నెలల ఈఎంఐ హాలిడే వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి కస్టమర్లను మరింత ఆకర్షించి అమ్మకాల పెరుగుదలకు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మొత్తానికి, జిఎస్టి తగ్గింపు నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి ఊతం ఇవ్వడమే కాకుండా, వినియోగదారులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది. కియా, ఎంజీ లాంటి ప్రముఖ బ్రాండ్లు ఈ లాభాలను నేరుగా బదిలీ చేయడం వల్ల, పండుగ సీజన్లో కార్ల అమ్మకాలు కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశముంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.