Sanjay Malhotra: 'మహాభారతంలో సంజయుడిని..' వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఆసక్తికర సమాధానం

Sanjay Malhotra: నేను సంజయ్ ని, కానీ మహాభారత సంజయుడిని కాదు... బుధవారం MPC నిర్ణయాల ప్రకటన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ తన గురించి ఈ వ్యాఖ్య ఎందుకు చేశారో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 9, 2025, 09:27 PM IST
Sanjay Malhotra: 'మహాభారతంలో సంజయుడిని..' వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఆసక్తికర సమాధానం

Sanjay Malhotra:  విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి కీలక వడ్డీరేట్లను సవరించింది ఆర్బిఐ. రెపోరేటును 0.25శాతం మేర తగ్గింది గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా  బుధవారం వెల్లడించారు. తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన ఆయనకు..భవిష్యత్తులో రేట్ల కోతపై ఓ ప్రశ్న ఎదురయ్యింది. దీనికి ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. 

Add Zee News as a Preferred Source

గత ఏడాది చివరిలోనే సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా రెండుసార్లు వడ్డీరేట్లకోతను ప్రకటించారు. దీంతో రాబోయే నెలల్లో మరిన్ని తగ్గింపులు ఉండొచ్చా అని మీడియా అతన్ని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ లక్ష్యాలను చేరుకునేందుకు మానిటరీ పాలసీ, ఆర్థిక కమిటీ సమిష్టిగా పనిచేస్తున్నాయి. ఇటీవల కేంద్రం కూడా బడ్జెట్లోనూ ఇందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. 

Also Read: Most Expensive Tomato In The World: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టొమాటో.. పూట కర్రీకి ఆస్తులు అమ్ముకోవాల్సిందే  

మూలధన వ్యయాన్ని పెంచడం, పన్ను రిబేట్లు వంటివి కల్పించింది. ఇప్పుడు మేము కూడా రెపోరేటును తగ్గించాము. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందని నేను కూడా చెప్పలేము. ఎందుకంటే నేను కేవలం సంజయ్ ని మాత్రమే..మహాభారతంలో సంజయుడిని కాదు కదా..ఆయనలా భవిష్యత్తును చూడగలిగే దివ్యద్రుష్టి నాకు లేదు అని అన్నారు. 

పురాణాల ప్రకారం..మహాభారతంలో సంజయుడు కౌరవుల రాయబారిగా ఉన్నాడు. కురక్షేత్రయుద్ధం సమయంలో కౌరవరాజు ధ్రుతరాష్ట్రుడి వద్దే ఉంటూ..తన దివ్యద్రుష్టితో యుద్ధభూమిలో ఏం జరుగుతుందో వివరించాడు. కురుక్షేత్రంలో క్రుష్ణ పరమాత్ముడు ప్రవచించిన భగవద్గీతను భగవానుడు ఆయన సన్నిహితుడైన సంజయునికి దివ్యద్రుష్టిని ఇచ్చాడు. సంజయునికి ధర్మనిరతునిగా పేరుంది. 

Also Read: Gold Rate: పసిడిప్రియులు ఎగిరి గంతేసే వార్త.. ఏకంగా రూ. 4000లకు పడిపోయిన బంగారం ధర  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News