Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు

Budget 2025: 2025 బడ్జెట్‌లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.  

Written by - Bhoomi | Last Updated : Feb 1, 2025, 12:09 PM IST
Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు

Budget 2025:  మోదీ ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) కింద రుణం తీసుకునే పరిమితిని ఇప్పుడు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరడంతో పాటు వారు తమ వ్యవసాయ అవసరాలను మెరుగైన మార్గంలో తీర్చుకోగలుగుతారు.

Add Zee News as a Preferred Source

బడ్జెట్ 2025 ప్రారంభంలో, అన్నదాత రైతులకు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. 

ప్రధాన మంత్రి ధనధాన్య యోజన: 

ఈ పథకం కింద రైతులకు అదనపు ఆర్థిక సహాయం, ఆహార ఉత్పత్తిలో బలం లభిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెరిగింది: 

ఇప్పుడు రైతులు KCC ద్వారా 5 లక్షల రూపాయల వరకు సులభంగా రుణం తీసుకోగలుగుతారు, ఇది వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను స్వీకరించడానికి, దేశంలో 7.75 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు.కొత్త నిర్ణయంతో రైతులకు తక్కువ వడ్డీకే ఎక్కువ రుణాలు అందనున్నాయి.దీంతో వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరుగుతుంది. పంట ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. గత 10 ఏళ్లలో భారతదేశ వృద్ధి రేటు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా ఉందని  నొక్కి చెప్పారు. పేదలు, యువత, రైతులు, మహిళలు, ఆరోగ్యం, మేక్ ఇన్ ఇండియా, ఉపాధి, ఆవిష్కరణల వంటి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.

2025 బడ్జెట్‌లో, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధనధాన్య యోజనను ప్రకటించారు.

-బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు కానుంది

-యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం

-5 సంవత్సరాల పత్తి ఉత్పత్తి మిషన్ అమలు చేయబడుతుంది

-పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన కోసం మిషన్‌ను అమలు చేయనున్నారు

-పండ్లు-కూరగాయల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తారు

-ఫుడ్ ప్రాసెసింగ్‌ను పెంచడం ద్వారా రైతుల లాభాలు పెరుగుతాయి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News